News December 27, 2025
చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడి మృతి

ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో జరిగింది. తిరుపతి-బెంగళూరు హైవేపై వెళ్తున్న కారు కె.పట్నం బ్రిడ్జి వద్ద గురువారం సాయంత్రం లారీని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో అదుపు తప్పి లారీని వెనుక వైపు నుంచి కారు ఢీకొట్టింది. కారులో ఉన్న కోమల(40), ఆమె కుమారుడు వర్ధన్ గౌడ్(11) తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చనిపోయారు. మృతదేహాలను శుక్రవారం బంధువులకు అప్పగించారు.
Similar News
News December 30, 2025
చిత్తూరులో తగ్గిన నేరాల శాతం: SP

చిత్తూరు జిల్లాలో 2025 సంవత్సరంలో నేరాల శాతం తగ్గినట్టు ఎస్పీ తుషార్ తెలిపారు. పోలీసు శాఖ వార్షిక నివేదికను ఆయన తెలియజేశారు. గత సంవత్సరం 7034 కేసులు నమోదు కాగా, ఈసారి 5216 నమోదు అయ్యాయని, 26% తగ్గుదల కనిపించిందని చెప్పారు. రూ. 2 కోట్లు విలువచేసే 1021 మొబైల్ ఫోన్లను బాధితులకు అందించామన్నారు. సైబర్ బాధితులకు రూ. 68 లక్షలు రికవరీ చేసి అందజేశామన్నారు.
News December 30, 2025
చిత్తూరు జిల్లా పరిపాలన పునర్వ్యవస్థీకరణ

పలమనేరు రెవెన్యూ డివిజన్లో ఉన్న బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్లో విలీనం చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మార్పు 2025 డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు గెజిట్లో ఉత్తర్వులు ప్రచురించనున్నారు. ఈ మార్పుతో బంగారుపాలెం మండల ప్రజలకు చిత్తూరు కేంద్రంగా పరిపాలనా సేవలు అందనున్నాయి.
News December 30, 2025
చిత్తూరు: క్రికెట్ టోర్నీలో అదరగొట్టిన యువకుడు

గుంటూరులో జరుగుతున్న ఎలైట్ అండర్-19 క్రికెట్ టోర్నీలో చిత్తూరు జిల్లా వి.కోట విద్యార్థి కార్తీక్ అదరగొట్టాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడుతున్న అతను సెమి ఫైనల్లో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ క్రికెట్ అకాడమీ జట్టుపై చెలరేగి ఆడాడు. ఓపెనర్గా వచ్చిన కార్తీక్ 7 ఫోన్లు 3 సిక్సర్లతో 82 బంతుల్లోనే 96 రన్స్ చేశాడు. తన జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు. బుధవారం తుది పోరు జరగనుంది.


