News August 29, 2024

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

image

కర్ణాటక-ఆంధ్ర సరిహద్దు దండుపాళ్యం గేటు వద్ద బుధవారం రాత్రి కారు- ఓ ప్రైవేటు వాహనం ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు మరణించారు. మరో పన్నెండు మంది గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిలో తిరుపతికి చెందిన జగదీశ్వరి ఉన్నారని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.

Similar News

News December 21, 2025

చిత్తూరు: రేపు ఉదయం 9 నుంచి ప్రారంభం.!

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యక్రమం జరగనుందని, జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీ నమోదు, స్థితిపై 1100కి కాల్ చేయవచ్చన్నారు.

News December 21, 2025

జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పెద్దిరెడ్డి

image

YCP అధినేత జగన్ను ఆదివారం ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్‌కు బొకే అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం పెద్దిరెడ్డి గురించి వివరించారు.

News December 21, 2025

TDP చిత్తూరు జిల్లా బాస్ ఎవరంటే..?

image

TDP చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా షణ్ముగ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వై.సునీల్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. పుత్తూరుకు చెందిన షణ్ముగ రెడ్డిది వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం. గతంలో జిల్లా అధ్యక్షుడిగా CRరాజన్ పనిచేశారు. ప్రస్తుతం అదే సామాజికవర్గానికి చెందిన షణ్ముగ రెడ్డికి అవకాశమిచ్చారు. తిరుపతి జిల్లా అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా డాలర్స్ దివాకర్ రెడ్డి నియమితులయ్యారు.