News April 21, 2024
చిత్తూరు: వడదెబ్బ తగిలి ఏఎస్ఐకి తీవ్ర గాయాలు

తంబళ్లపల్లికి ఎన్నికల విధులకు వెళుతున్న ఏఎస్ఐ వడదెబ్బ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి కథనం.. ఎన్నికల విధులకు తంబళ్లపల్లికి వెళ్తున్న మదనపల్లి ట్రాఫిక్ ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం కురబలకోట మండలం, ముదివేడు క్రాస్ వద్ద వడదెబ్బ తగలడంతో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. అదే సమయంలో మదనపల్లికి వస్తున్న లోకేశ్ అనే యువకుడు తన కారులో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Similar News
News October 11, 2025
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పరిశీలించిన చిత్తూరు ఎస్పీ

చిత్తూరులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ను ఎస్పీ తుషార్ డూడీ శుక్రవారం పరిశీలించారు. త్వరలోనే రిక్రూట్ కానిస్టేబుల్లకు శిక్షణ ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. శిక్షణ ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండేలా అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వసతి గదులు పరిశుభ్రంగా గాలి, వెలుతురు ఉండేలా చూడాలని ఆదేశించారు.
News October 10, 2025
రేపు దేవళంపేటలో పర్యటించనున్న మంత్రి

వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని హోం మంత్రి అనిత శనివారం పరిశీలించనున్నట్లు జీడీనెల్లూరు నియోజకవర్గ టీడీపీ నాయకులుతెలిపారు. ఉదయం 10 గంటలకు ఆమెతోపాటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.
News October 10, 2025
చిత్తూరు: టీచర్ల శిక్షణను పరిశీలించిన కలెక్టర్

మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లకు చిత్తూరులోని ఓ స్కూల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిని కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. నూతనంగా ఎంపికైన టీచర్లు బాధ్యతాయుతంగా పనిచేసి భావి భారత పౌరులను తయారు చేసేలా కృషి చేయాలని సూచించారు. విధుల్లో చేరిన నాటి నుంచి చివరి దశ వరకు ఉత్సాహంగా పనిచేయాలన్నారు. సమగ్ర శిక్ష ఏపీడీ వెంకటరమణ, ఇందిరా, నాగేశ్వరరావు పాల్గొన్నారు.