News July 18, 2024

చిత్తూరు: విద్యుత్ పోల్స్ మార్చండి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాలను తక్షణమే మార్పు చేయాలని ఎస్ఈ సురేంద్రనాయుడు ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల వర్షాల కురుస్తున్నాయని.. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. వినియోగదారులు సైతం ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Similar News

News August 31, 2024

ఆంధ్రా క్రికెట్ జట్టుకు యువకుడి ఎంపిక

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా యువకుడు తన ప్రతిభతో సత్తా చాటాడు. రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వల్లాల దర్శన్ రాజు ఆంధ్ర అసోసియేషన్ టీ20 క్రికెట్ మ్యాచ్ జట్టుకు ఎంపికయ్యారు. నేపాల్(పొక్రా)లో సెప్టెంబర్ 18న జరగనున్న టీ20లో పాల్గొంటారు. దర్శన్ రాజును కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడాకారులు అభినందిస్తున్నారు.

News August 31, 2024

కుప్పం : కవలలకు జన్మనిచ్చి..తల్లి సూసైడ్..ఎందుకంటే

image

పెద్దబంగారునత్తం చెరువులో శుక్రవారం మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. శ్రీదేవికి(48) 2020లో మదనపల్లె వాసితో పెళ్లైంది. మూడేళ్లైనా పిల్లలు లేకపోవడంతో వైద్య చికిత్సతో గర్భం దాల్చి ఈనెల 3న ఆడ,మగకు జన్మనిచ్చింది. బాలింతగా ఉన్న ఆమెకు సపర్యలు చేసేందుకు బంధువులు రాలేదు. దీంతో అనారోగ్యానికి గురై మనస్తాపం చెంది, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 31, 2024

మదనపల్లె: RTC లక్కీడిప్ విజేతలు వీరే..!

image

మదనపల్లె-తంబళ్లపల్లె మార్గంలో RTC గిఫ్ట్ స్కీంలో లక్కీ డ్రా విజేతలను ఎంపిక చేశారు. పట్టణంలోని బస్టాండ్లో డీఎం వెంకటరమణా రెడ్డి ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీశారు. చిన్ని మధు, B.సాంబశివ, విజయ్‌ను అదృష్టం వరించింది. విజేతలు RTC డిపోనకు వచ్చి బహుమతులు తీసుకోవాలని మేనేజర్ సూచించారు. సెప్టెంబర్ 1నుంచి 25వరకు MPL-BKT మార్గంలో ప్రయాణించే వారికి లక్కీడ్రా ఉంటుందని చెప్పారు.