News May 11, 2024

చిత్తూరు: సమయం లేదు మిత్రమా.. ఓట్ల వేటలో అభ్యర్థులు

image

ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. అభ్యర్థులు పార్టీ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటు తమకే వేయాలని అభ్యర్థిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలు సేకరించి వారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

Similar News

News February 21, 2026

పలమనేరు: APO సస్పెండ్.. అసిస్టెంట్లకు నోటీసులు..!

image

పలమనేరు ఉపాధి హామీ పనుల్లో <<19204298>>అవినీతి<<>> జరిగిందని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు APO రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. అసిస్టెంట్‌లకు షోకాస్ నోటీసులను జారీ చేశారు. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, FIR నమోదు చేసినట్లు సమాచారం. సమగ్ర విచారణ అనంతరం.. ఈ అంశంలో ఎంత మేర ప్రభుత్వ నిధులు ప్రజలకు అందకుండా స్వాహా చేశారో తేలనుంది.

News February 21, 2026

ZP ఛైర్మన్ ఫిర్యాదుతో విషయం బయటకు..!

image

అధికార పార్టీ నేతల అండదండలతో పలమనేరులో ఉపాధి హామీ పనుల్లో భారీ <<19204272>>అవకతవకలు<<>> జరిగాయని చిత్తూరు ZP ఛైర్మన్ కలెక్టర్ సుమిత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. వేజెస్ రూపంలో అందించే నగదును ఏపీఓ, అసిస్టెంట్లు తమ సొంత అకౌంట్లకు బదిలీ చేసుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. దీంతో ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నివేదికను సమర్పించాలని డ్వామా పీడీకి కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

News February 21, 2026

పలమనేరు: నకిలీ బిల్లుల సృష్టి కర్తలు వీళ్లే..!

image

<<19204252>>నకిలీ బిల్లుల<<>> వ్యవహారంలో APO రవికుమార్, టెక్నికల్ అసిస్టెంట్ ఉషశ్రీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఉదయ్ కుమార్ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలమనేరులోని అంబేడ్కర్ నగర్ బసాపురం పోస్టాఫీస్‌లో వారం రోజుల వ్యవధిలో 100కు పైగా అకౌంట్లు ఓపెన్ చేశారని ప్రాథమిక సమాచారం. ముందు చేసిన పనులకు బిల్లు పెట్టినట్లు కొన్ని, డమ్మీ మస్టర్ క్రింద మరి కొన్ని బిల్లులు పెట్టినట్లు సమాచారం.