News September 1, 2025
చిత్తూరు: సాయుధ దళాలకు వీడ్కోలు

ఏడు రాష్ట్రాలు దాటి మోటార్ సైకిల్ పై వెళ్తున్న సాయుధ దళాలకు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా ఉందని అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. చిత్తూరులోని కాణిపాకం బైపాస్ రోడ్డులో సోమవారం ట్రై నేషన్, ట్రై సర్వీసెస్ లార్డ్ బుద్ధ మోటార్ సైకిల్ యాత్రను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఇలాంటి యాత్రలు యువతకు గొప్ప స్ఫూర్తి అని ఆయన చెప్పారు. యాత్ర చేస్తున్న వారికి ఘన వీడ్కోలు పలికారు.
Similar News
News September 4, 2025
KPM: నీళ్లు ఆగిపోయాని ప్రచారం.. కేసు నమోదు

హంద్రీనీవా కాలువలో నీళ్లు రావడం లేదని ప్రచారాలు చేసిన వారిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాలతో పాటు X వేదికగా పోస్టులు పెట్టిన వారిని గుర్తించినట్లు కుప్పం అర్బన్ సీఐ శంకరయ్య వెల్లడించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని తప్పుడు కథనాలు, పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News September 4, 2025
చిత్తూరు RWS ఎస్ఈగా ప్రసన్న కుమార్

చిత్తూరు జిల్లా గ్రామీణ నీటి సరఫరా(RWS) శాఖ ఎస్ఈగా ప్రసన్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఈఈగా పనిచేస్తున్న ఆయనకు ఎస్ఈగా ప్రమోషన్ వచ్చింది. బదిలీపై చిత్తూరుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు కృషి చేస్తానన్నారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ను ఆయన కలిశారు.
News September 4, 2025
చిత్తూరు జిల్లాకు నిధుల మంజూరు

చిత్తూరు జిల్లాలో 697 పంచాయతీలకు గాను 667కు నిధులు వచ్చాయి. 16వ ఆర్థిక సంఘం కింద కేంద్రం రూ.29.78 కోట్లు రిలీజ్ చేసింది. రికార్డులు పూర్తి చేయకపోవడంతో 17 పంచాయతీలు, ఎన్నికలు జరగకపోవడంతో మరో 13 పంచాయతీలకు నిధులు రాలేదు. టైడ్ నిధులను పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది. అన్లైడ్ నిధులను వీధి లైట్లు, శ్మశానాల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణాలకు ఖర్చు చేస్తారు.