News March 20, 2024
చిత్తూరు: CR రాజన్కు అధ్యక్ష పదవి

TDP చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా తిరుచానూరు మాజీ సర్పంచ్ CR రాజన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ఆ పదవిలో వున్న పులివర్తి నాని TDP చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికల్లో బిజీగా ఉండటంతో ఆయన బాధ్యతలను రాజన్కు అప్పగిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు విడుదల చేశారు. ఆయన చిత్తూరు సీటు ఆశించగా గురజాల జగన్మోహన్కు దక్కింది.
Similar News
News November 17, 2025
చిత్తూరు: 27 మంది సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు

27 మంది సచివాలయం సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఆదేశించారు. అనధికారికంగా సెలవుపై ఉండటంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు. మెడికల్ లీవ్లో ఉన్న 152 మందిని మెడికల్ బోర్డులో పరీక్షల నిర్వహించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News November 17, 2025
చిత్తూరు: 27 మంది సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు

27 మంది సచివాలయం సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఆదేశించారు. అనధికారికంగా సెలవుపై ఉండటంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు. మెడికల్ లీవ్లో ఉన్న 152 మందిని మెడికల్ బోర్డులో పరీక్షల నిర్వహించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News November 17, 2025
చిత్తూరు: కుంకీ ఏనుగు జయంత్కు మస్త్

కుంకి ఏనుగుల్లో ఒకటైన జయంత్కు మస్త్ రావడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. సాధారణంగా ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య మగ ఏనుగులు పునరుత్పత్తి హార్మోన్ల పెరుగుదల వలన మస్త్ వస్తుంది. ఈ సమయంలో ఏనుగులు చాలా దూకుడుగా ప్రవర్తిస్తాయి. ఏనుగులు ఈ దశలో అదుపు తప్పి ప్రవర్తించి, మనుషులపై లేదా ఇతర ఏనుగులపై దాడి చేసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో జయంత్ను వెటర్నరీ డాక్టర్ పరిశీలించారు.


