News February 28, 2026
చిత్తూరు MLAలకు ఇవి కనబడటం లేదా..?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా, మామిడి రైతులు ఏటా కష్టాలు తప్పడం లేదు. ఆశించిన మేర ధరలు ఉండటం లేదు. మామిడి బోర్డు, టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఏటా ఎన్నికల్లో నాయకులు హామీ ఇస్తున్నారు. గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. టమాటా, మామిడి రైతుల కష్టాల గురించి ఏ ఒక్క MLA ప్రస్తావించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Similar News
News March 1, 2026
నేడు విండీస్తో ఢీ.. ఈ’డెన్’ కలిసొస్తుందా?

T20WC: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు భారత్-విండీస్ తలపడనున్నాయి. సెమీస్ చేరాలంటే భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. అయితే 1983 నుంచి ఈడెన్లో భారత్ను విండీస్ ఎప్పుడూ ఓడించలేకపోయింది. భారత్ చేతిలో నాలుగు T20I సహా తొమ్మిది మ్యాచ్లు ఓడిపోగా మరో రెండు డ్రా అయ్యాయి. ఇక 2016 టీ20 ప్రపంచకప్ తర్వాత విండీస్ ఎప్పుడూ సెమీస్ చేరలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
News March 1, 2026
కర్నూలు: మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.. కలెక్టర్ ఆదేశం!

కర్నూలు జిల్లాలో మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని అరికట్టాలని కలెక్టర్ డా.ఏ సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని NCORD సమావేశంలో మాట్లాడుతూ.. విద్యాసంస్థల వద్ద నిఘా పెంచాలని, RTC బస్సుల్లో అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. జనవరి నుంచి జిల్లాలో 2 కేసులు నమోదు చేసి 1.350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి సాగుపై నిఘా ఉంచాలని రెవెన్యూ, పోలీసు శాఖలను కలెక్టర్ ఆదేశించారు.
News March 1, 2026
దౌత్యమే కాపాడింది.. ఆ ఒక్క గల్ఫ్ దేశం సేఫ్!

US, ఇజ్రాయెల్పై ప్రతీకార దాడుల్లో భాగంగా గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడుతున్న ఇరాన్ ఒమన్ను మాత్రం విడిచిపెట్టింది. దౌత్యంలో US, ఇరాన్లకు ఒమన్ సమాన ప్రాధాన్యం ఇవ్వడమే కారణం. గతంలో పలు సందర్భాల్లో ఇరు దేశాలకు ఒమన్ మధ్యవర్తిగా పనిచేసింది. దీంతో పాటు ఒమన్లో US స్థావరం లేదు. మరోవైపు బహ్రయిన్, కువైట్, ఖతార్, UAE, సౌదీ USకు మద్దతు ఇస్తున్నాయి. కాగా ఒమన్లో దాదాపు 9లక్షల మంది భారతీయులు ఉన్నారు.


