News April 12, 2024
చిత్తూరు MLA అభ్యర్థులపై కేసు నమోదు

చిత్తూరు జిల్లాలో ఈనెల 18 నోటిఫికేషన్ రానుందని.. అభ్యర్థులు ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ షన్మోహన్ స్పష్టం చేశారు. చిత్తూరు కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు నగరంలో నిన్నటి రంజాన్ వేడుకల్లో ఉద్రిక్తతకు కారణమైన వైసీపీ, టీడీపీ అభ్యర్థులు విజయానందరెడ్డి, గురుజాల జగన్మోహన్పై 171 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.
Similar News
News April 22, 2025
చిత్తూరు: 24 నుంచి వేసవి సెలవులు

ఈనెల 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 12వ తేదీ పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని, కానీ ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు జూన్ 5 వ తేదీన రీడీనెస్ యాక్టివిటీస్ కోసం రిపోర్ట్ చేయాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
News April 22, 2025
చిత్తూరు : ఇంటర్ డీఐఈఓగా శ్రీనివాసులు

చిత్తూరుజిల్లా ఇంటర్మీడియట్ డీఐఈఓగా ఏ. శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో డీకే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులును చిత్తూరు డీఐఈఓగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో చిత్తూరు డీఐఈఓగా పనిచేస్తున్న మౌలా తన పూర్వపు స్థానం కణ్ణన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా కొనసాగనున్నారు.
News April 22, 2025
చిత్తూరు జిల్లాలో అలా చేస్తే జైలుశిక్ష

మామిడి కాయలను మగ్గించడానికి కాల్షియం కార్బైడ్ అమ్మడం, నిల్వ చేయడం, రవాణా చేయడం చట్టరీత్యా నేరమని చిత్తూరు జేసీ విధ్యాధరి హెచ్చరించారు. ఎక్కడైనా తనిఖీల్లో కాల్షియం కార్బైడ్ పట్టుబడితే సెక్షన్ 44(ఏ) ప్రకారం 3 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తామని చెప్పారు. ఎథిలీన్ గ్యాస్, ఎత్రెల్ ద్రావణాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు.