News January 1, 2026

చిత్తూరు MPకి 94 శాతం హాజరు

image

2025 సంవత్సరంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పార్లమెంటుకు 94 శాతం హాజరయ్యారు. మొత్తం 122 ప్రశ్నలను పార్లమెంటులో అడిగారు. ఏడు అంశాలకు సంబంధించిన డిబేట్స్ లో ఆయన పాల్గొన్నారు.

Similar News

News January 2, 2026

మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులను పరిశీలించి రికార్డులపై ఆరా తీశారు. ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 2, 2026

పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్

image

రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లాలోని రైతులకు అందజేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల మండలం వసంతాపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈనెల తొమ్మిది వరకు జిల్లావ్యాప్తంగా సచివాలయాల పరిధిలో గ్రామసభలు నిర్వహించి నూతన పుస్తకాలను అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

News January 2, 2026

చిత్తూరు: రూ.350 కోట్ల ఆదాయం.. మారని బతుకులు.!

image

పేరుకే CM సొంత జిల్లా. కుప్పం మినహా మరెక్కడ అభివృద్ధే లేదట. పరిశ్రమలు, మౌలిక వసతులు, రవాణా అంతంత మాత్రమే. నేటికీ తాము విద్య, వైద్యం కోసం తమిళనాడు, TPTకి వెళుతున్నట్లు స్థానికులు అంటున్నారు. జిల్లాలో 960 క్వారీలు ఉన్నాయి. ఏటా రూ.200-250 కోట్ల ఆదాయం వస్తుందట. మున్సిపాలిటీ పన్నులు ఇతర మార్గాల నుంచి వచ్చే రూ.80 కోట్లు అదనం. ఈఆదాయం ఎక్కడికి పోతుంది, జిల్లా అభివృద్ధి ఎందుకు జరగలేదో ఆ మురుగన్‌కే తెలియాలి