News April 16, 2024

చిత్తూరు: SPని ఆశ్రయించిన ప్రేమజంట

image

చిత్తూరు : ప్రేమ పెళ్లి చేసుకున్నాం రక్షణ కల్పించండని అని ఓ ప్రేమజంట జిల్లా ఎస్పీ మణికంఠను ఆశ్రయించారు. పెనుమూరు మండలం ఎగువ పూనేపల్లి గ్రామానికి చెందిన మౌలాలి కుమార్తె జాస్మిన్, తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ చారాల దళితవాడకు చెందిన మురుగేశ్ కుమారుడు తిరుమలేష్ మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త తిరుమలేశ్ ఎస్సీ కులస్తుడు కావడంతో మా తల్లిదండ్రులు అడ్డుపడ్డారని ఆమె వాపోయారు.

Similar News

News April 23, 2025

టెన్త్ ఫలితాల్లో 24వ స్థానంలో చిత్తూరు జిల్లా

image

తాజా టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 24వ స్థానంలో నిలించింది. మొత్తం 20,796 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 13,946 మంది పాస్ అయ్యారు. 10,723 మంది అబ్బాయిలకుగాను 6,573 మంది, అమ్మాయిలు 10,073 మందికిగాను 7,373 మంది పాస్ అయ్యారు. కాగా 67.06 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

News April 23, 2025

సివిల్స్‌లో మెరిసిన పలమనేరు వాసి

image

UPSC తుది ఫలితాలలో చిత్తూరు జిల్లా వాసి సత్తా చాటాడు. పలమనేరుకు చెందిన రంపం శ్రీకాంత్ మంగళవారం వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 904వ ర్యాంకు సాధించాడు. శ్రీకాంత్ ఎలాంటి కోచింగ్ లేకుండా ఈ ఘనత సాధించడంతో జిల్లా వాసులు అతనికి అభినందనలు తెలిపారు.

News April 23, 2025

చిత్తూరు: నేడే 10 ఫలితాల విడుదల

image

రాష్ట్ర వ్యాప్తంగా నేడు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది పరీక్షలు రాసిన 21,245 మంది విద్యార్థుల భవిష్యత్తు నేడు తేలనుంది. ఫలితాల విడుదలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో 21,245 మంది పరీక్ష రాయగా వారిలో 294 మంది ప్రైవేట్‌గా, 20,951 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష రాశారు.

error: Content is protected !!