News April 15, 2025

చిత్తూరు TDP నేత ఇంట్లో విషాదం

image

TDP నేత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. జీడీనెల్లూరు(M) జూపల్లిలో TDP నేత గోపాల్ రెడ్డి ఉండగా.. భార్య మీనా పిల్లలతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. తమిళనాడులోని గుడికి సోమవారం వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. బెంగళూరులో ఆదివారం మీనా పూలమాలలు తీసుకుని బయల్దేరారు. రాత్రి గోపాల్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. ‘దేవుడికి వేయాల్సిన మాల నీపై వేయాల్సి వచ్చింది’ అంటూ మీనా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.

Similar News

News April 16, 2025

చిత్తూరు: కంట్రోల్ సెంటర్ పరిశీలించిన ఎస్పీ

image

చిత్తూరులోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం సందర్శించారు. సీసీ కెమెరాల నియంత్రణ, ట్రాఫిక్ మానిటరింగ్ వ్యవస్థ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజం వంటి అంశాలను పరిశీలించారు. సెంటర్ నెట్వర్క్‌ను అనుసంధానించబడిన ముఖ్య కూడలిలో సీసీ కెమెరాలు దృశ్యాలను లైవ్‌గా పరిశీలించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. శక్తి యాప్‌లో SOS సంకేతం ద్వారా ఫిర్యాదులను కంట్రోల్ సెంటర్ సిబ్బంది చూడాలన్నారు.

News April 16, 2025

తిరుపతిలో అమానుష ఘటన

image

తిరుపతి రూరల్ BTRకాలనీలో ఓ వృద్ధుడు స్థానికంగా ఉంటున్న పిల్లలకు తన ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. నిన్న తన ఇంట్లో ముగ్గురు చిన్నారులకు వీడియోలు చూపిస్తుండగా స్థానికులు గమనించారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు మేస్త్రి పనులు చేసే సెల్వంగా గుర్తించి అతడి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

News April 16, 2025

చిత్తూరు: ‘ప్రభుత్వానికి, ప్రజలకు వారధి జర్నలిస్టులే’

image

ప్రభుత్వానికి, ప్రజలకు జర్నలిస్టులు వారధి వంటి వారు అని జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ తెలిపారు. మంగళవారం ఈ నెల 22న జరగనున్న APWJF 4వ జిల్లా మహాసభలకు ఆహ్వానిస్తూ కలెక్టర్ ఛాంబర్‌లో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ చేతుల మీదుగా గోడ పత్రిక ఆవిష్కరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ వాస్తవాలను ప్రచురించడంలో జర్నలిస్టులు కృషి చేస్తున్నారన్నారు. వారి సంక్షేమానికి అండగా ఉంటామన్నారు.

error: Content is protected !!