News May 15, 2024
చినగంజాం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదంతో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. అయితే, వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. చినగంజాం మండలం నీలాయిపాలెంకు చెందిన ఉప్పుగుండూరు కాశీ (65), లక్ష్మి (55), చిన్నారి సాయిశ్రీ (8) మృతి చెందారు. ఒకేసారి కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Similar News
News December 11, 2025
రాచర్ల: స్వగ్రామంలో మాజీ MLA అంత్యక్రియలు

మాజీ MLA పిడతల <<18527850>>రామ్ భూపాల్ రెడ్డి<<>> స్వగ్రామం రాచర్ల మండలం అనుమలవీడు గ్రామం. కాగా ఆయన ఇవాళ తెల్లవారుజామున స్వర్గస్తులైన విషయం తెలిసిందే. వారి పార్థివదేహాన్ని గురువారం అనుమలవీడుకు తరలిస్తామని, గ్రామంలోనే శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు వారి తనయుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
News December 11, 2025
గిద్దలూరు: రాజకీయంలో పిడతల కుటుంబం

గిద్దలూరు రాజకీయ ముఖ చిత్రంలో పిడతల కుటుంబం ప్రాధాన్యత అధికం. పిడతల రంగారెడ్డి 1937 నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసి, ఆ తర్వాత ఎమ్మెల్యే, మంత్రి, స్పీకర్గా పదవులు చేపట్టారు. 1991లో ఈయన కన్నుమూశారు. 1994 ఎన్నికల్లో పిడతల రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 1999లో ఎమ్మెల్యేగా విజయ్ కుమార్ రెడ్డి గెలవగా.. 2001లో ఈయన మరణంతో ఉపఎన్నికలు జరిగాయి. ఈయన సతీమణి సాయికల్పన ఎమ్మెల్యే అయ్యారు.
News December 11, 2025
BREAKING: గిద్దలూరు మాజీ MLA మృతి

గిద్దలూరు మాజీ MLA పిడతల రామ్ భూపాల్ రెడ్డి (89) స్వర్గస్థులయ్యారు. వయో భారంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రామ్ భూపాల్ రెడ్డి ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రామ భూపాల్ రెడ్డి TDP నుంచి పోటీ చేసి 1994లో MLAగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి వైసీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.


