News May 16, 2024

చినగంజాం: మృతులకు సీఎం జగన్ నష్టపరిహారం

image

చినగంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిలకలూరిపేట వద్ద లారీని ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, గాయపడిన 30 మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన 20 మంది చినగంజాం వాసులే.

Similar News

News December 12, 2025

ప్రకాశం జిల్లాలో భార్యాభర్తలు సూసైడ్.!

image

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దంతరపల్లికి చెందిన ఈ దంపతులు 5 నెలలక్రితం అదృశ్యమయ్యారు. అప్పుల బాధతో ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News December 12, 2025

ప్రకాశం జిల్లా TDP అధ్యక్ష పదవి.. ఛాన్స్ ఉగ్రాకేనా?

image

ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఇంకా భర్తీ కాని విషయం తెలిసిందే. కొన్ని నెలలక్రితం ఇక అధ్యక్ష పదవి భర్తీ అవుతుందని క్యాడర్ భావించినా TDP అధిష్ఠానం మాత్రం ఆచీతూచీ అడుగులు వేస్తోంది. అయితే జిల్లా అధ్యక్ష పదవికి పలువురి పేర్లు తెరపైకి వచ్చినా, అధిష్ఠానం రాజకీయ సమీకరణాల ప్రకారం నిర్ణయం తీసుకోనుందట. తాజాగా కనిగిరి MLA ఉగ్ర నరసింహారెడ్డి పేరు అధ్యక్ష రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరి మీ కామెంట్.

News December 12, 2025

ప్రకాశం: ఈనెల 13, 14న టీచర్లకు క్రీడలు.!

image

ప్రకాశం జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో ఈనెల 13, 14న ఉపాధ్యాయుల క్రీడలు నిర్వహించనున్నట్లు డీఈఓ రేణుక తెలిపారు. మహిళా ఉపాధ్యాయులకు త్రో బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని, ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ఒంగోలులోని పీవీఆర్ హైస్కూల్, మార్కాపురంలోని హైస్కూల్, కనిగిరిలోని డిగ్రీ కళాశాల ఆవరణంలో క్రీడలు జరుగుతాయన్నారు.