News February 27, 2026
చిన్నగంజాంలో విద్యుత్ షాక్కి గురై వ్యక్తి మృతి

చిన్నగంజాంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. ఉప్పు కొట్టారులో పనిచేస్తున్న పలబోలు శ్రీకాంత్ విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. తన సొంత ఉప్పు కొట్టారులో మోటార్ వద్ద కరెంట్ వైర్ బిగించే సమయంలో ప్రమాదవశాత్తు షాక్ తగిలినట్లు సమాచారం. మృతుడికి భార్యతో పాటు పదేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. శ్రీకాంత్ మృతితో సోపిరాల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Similar News
News March 1, 2026
సంజూ హాఫ్ సెంచరీ

T20WC: కీలక మ్యాచ్లో ఓపెనర్ సంజూ శాంసన్(56*) అద్భుతంగా ఆడుతున్నారు. విండీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అభిషేక్(10), ఇషాన్(10) తక్కువ పరుగులకే ఔటైనా వరుసగా బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. కెప్టెన్ సూర్య 18 పరుగులు చేసి ఔటైన నేపథ్యంలో తిలక్తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేస్తే ఇండియా విజయం సాధించడం ఖాయమవుతుంది.
News March 1, 2026
GDK: స్టేషన్లో పార్కింగ్ ఏంటని బైక్పై ప్రతాపం చూపించిన పోలీస్ అధికారి

RMG పోలీస్ కమిషనరేట్లోని ఓ పోలీస్ స్టేషన్లో హోంగార్డుకు సంబంధించిన బైక్ను ఓ పోలీస్ అధికారి శనివారం ధ్వంసంచేశారు. అ ఠాణాలో రోజు పార్కింగ్ చేసి PDPLకి నిత్యం విధులు నిర్వహించేందుకు హోంగార్డు వెళ్తూ ఉంటాడు. ఇక్కడ పార్కింగ్ ఏంటని కోపగించుకున్న సదరు పోలీస్ అధికారి ఏకంగా బైక్పై తన ప్రతాపాన్ని చూపించారు. ఇష్టానుసారంగా పగలగొట్టి కసి తీర్చుకున్నారు. దీనిపై పోలీసు అధికారులకు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది.
News March 1, 2026
NTR: హైకోర్టు గెస్ట్ హౌస్ పనులకు శంకుస్థాపన చేసిన CJI

అమరావతి హైకోర్టు సమీపంలో 6,300 చదరపు గజాల స్థలంలో నిర్మించనున్న గెస్ట్ హౌస్ పనులకు CJI జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సైట్లో సీఎం చంద్రబాబు, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో కలసి CJI పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 50,000 చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాలో G+3 తరహాలో అధికారులు CRDA ఈ గెస్ట్ హౌస్ నిర్మించనున్నారు.


