News February 7, 2026
చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్.. త్వరలోనే నిర్ణయం!

చిన్న పిల్లలను SM నుంచి దూరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. వయసు ఆధారంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల వినియోగానికి అనుమతులపై సీరియస్గా ఆలోచిస్తున్నట్లు కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇటీవల ఆర్థిక సర్వే చేసిన సూచనలన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ICANN సదస్సులో ఆయన మాట్లాడారు.
Similar News
News February 8, 2026
భాను సప్తమి: నేడు ఏం చేయాలంటే?

భాను సప్తమి నాడు ఆదిత్యుడి 12 పేర్లు పలుకుతూ సూర్య నమస్కారాలు చేయాలి. దీంతో శరీరానికి శక్తి, మనసుకు ప్రశాంతత లభిస్తాయి. అర్ఘ్యం సమర్పిస్తే కంటి చూపు మెరుగుపడుతుంది. జాతక దోషాలు పోతాయి. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం కోసం ‘ఆదిత్య హృదయం’ పఠించాలి. రామరావణ యుద్ధంలో రాముడికి అగస్త్య మహాముని ఈ స్తోత్రాన్ని ఉపదేశించారు. నేడు చేసే దానం ఎంతో ఫలప్రదం. భాను సప్తమి వ్రతం ఆచరించడం అన్నింటికంటే ఉత్తమం.
News February 8, 2026
‘అంబానీ ఇస్తేనేం.. రోహిత్కు డైటే ముఖ్యం’

T20Iలు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డే WC-2027 ఆడేందుకు ఫిట్నెస్పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. నిన్న వాంఖడేలో మ్యాచ్కు హాజరైన రోహిత్ గ్యాలరీలో బిజినెస్మెన్ ముఖేశ్ అంబానీతో కలిసి మ్యాచ్ చూశారు. ఈ క్రమంలో ముఖేశ్ టీ ఆఫర్ చేయగా హిట్ మ్యాన్ తిరస్కరించారు. దీంతో రిచెస్ట్ మ్యాన్ ఆఫర్ చేసినా వద్దంటూ డ్రీమ్ కోసం కఠిన డైట్ పాటిస్తున్నారని రోహిత్ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
News February 8, 2026
ఓపెన్ డిగ్రీతో సాఫ్ట్వేర్ జాబ్!

TG: డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థులకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. TCSతో కలిసి ‘జాబ్ అచీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్’ అనే స్పెషల్ ప్రోగ్రాంను ప్రారంభించింది. దీంతో డిగ్రీ పట్టాతో పాటు ఉద్యోగ నియామకపత్రం అందేలా కోర్సును రూపొందించామని వీసీ ఘంట చక్రపాణి తెలిపారు. మార్చి 15లోగా అడ్మిషన్లకు అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు <


