News February 4, 2025
చిన్నారికి శ్రీశైలం ఎమ్మెల్యే సాయం

సున్నిపెంటకు చెందిన ఓ చిన్నారి వైద్యశాలలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రిక్షా కాలనీకి చెందిన శివ 5ఏళ్ల కుమార్తెపై ఇనుప గేటు ప్రమాదవశాత్తు పడింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయమై ఒంగోలులో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న శ్రీశైల మండల టీడీపీ ఇన్ఛార్జి వై.యుగంధర్ రెడ్డి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశాలతో చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తమై ఆర్థిక సాయం అందజేసి మానవత్వం చాటారు.
Similar News
News September 15, 2025
ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సమర్పించిన వినతులను వరంగల్ కలెక్టర్ సత్యశారద స్వయంగా స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు అందజేశారు. నేటి ప్రజావాణి కార్యక్రమానికి 166 ఫిర్యాదులు రాగా, అధికంగా రెవెన్యూ సమస్యలు 72, జీడబ్ల్యూ ఎంసీ 20, గృహ నిర్మాణ శాఖ 11, విద్యా శాఖ 9, డీఆర్డీవో 7, ఇతర శాఖలకు సంబంధించిన 47 ఫిర్యాదులు వచ్చాయి.
News September 15, 2025
నిజాంసాగర్: 5 గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్ ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 33,910 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ సోమవారం రాత్రి తెలిపారు. ప్రాజెక్టులోకి 38,829 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు చెప్పారు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 17.397 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రధాన కాలువకు 1,000 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది.
News September 15, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 115 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్లో సోమవారం 115 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.