News August 26, 2025
చిన్నారిని హింసించిన వ్యక్తికి జైలు శిక్ష

నాగులుప్పపాడు మండలం మాచవరంకి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి ఒంగోలు కోర్టు సోమవారం 2 సంవత్సరాలు జైలు శిక్ష రూ.10వేల జరిమానా విధించింది. ఓ మహిళతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న ముద్దాయి మహిళ కూతురైన చిన్నారిని తమకు అడ్డుగా ఉందని పలుమార్లు హింసించాడు. విచారించిన కోర్టు సాక్షదారాలు పరిశీలించి నిందితుడికి జైలు శిక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కోమల వల్లి తీర్పు ఇచ్చారు. ఈ విషయాన్ని ఎస్పీ తెలిపారు.
Similar News
News August 26, 2025
అర్జీదారులతో మర్యాదగా మెలగాలి: కలెక్టర్

అర్జీదారులతో అధికారులు మర్యాదపూర్వకంగా మాట్లాడాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం అనంతరం కలెక్టర్, అధికారులతో అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో అలసత్వం లేకుండా సకాలంలో పరిష్కరించేలా శ్రద్ధ చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీవెన్స్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషయాన్ని గుర్తించాలన్నారు.
News August 26, 2025
విద్యార్థులు లక్ష్యసాధన చేయాలి: కలెక్టర్

ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యార్థులకు సూచించారు. సోమవారం ఒంగోలులో వసతి గృహాలకు సంబంధించి విద్యార్థులను JD శీలం పరివర్తన భవనంలోకి షిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు.
News August 25, 2025
ఫోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష.!

ఫోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.7వేల జరిమానాను విధిస్తూ ఒంగోలు ఫోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. నిందితుడికి జైలు శిక్ష ఖరారుకావడంలో సరైన ఆధారాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. హనుమంతునిపాడు మండలానికి చెందిన ఓ వ్యక్తి, 2000 సంలో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనితో కేసు నమోదు కాగా, సదరు వ్యక్తికి మూడేళ్ల శిక్ష ఖరారైంది.