News February 12, 2025

చిన్నారి మృతి దురదృష్టకరం: మంత్రి

image

అల్లూరి జిల్లా తాడేపల్లిలో అన్నం తిన్న వెంటనే నులిపురుగుల మాత్రను వేయడంతో, గొంతులో అడ్డం పడి చిన్నారి మృతి చెందడం బాధాకరమని మంత్రి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీవో సింహాచలంను ఆమె ఆదేశించారు. వైద్య సిబ్బంది పర్యవేక్షణ లేకుండా, సక్రమ పద్ధతిలో మాత్రలు వేయకపోవడమే కారణమని ప్రాథమిక విచారణలో ఆయన గుర్తించారు. అంగన్వాడీ టీచర్, ఆయా, సూపర్వైజర్లను సస్పెండ్ చేశారు.

Similar News

News July 9, 2025

మహబూబాబాద్ జిల్లాకు 8 సబ్ స్టేషన్లు మంజూరు

image

జిల్లాలో వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ సరఫరా అందించడానికి కొత్తగా 8 సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని సూపరింటెండెంట్ ఇంజినీర్ విజయేందర్ రెడ్డి తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా అవసరం ఉన్న మేరకు కొత్తగా సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి లో వోల్టేజ్ సమస్య ఉండదని, సమర్థవంతంగా విద్యుత్ పంపిణీ మరింత మెరుగుపడుతుందని వివరించారు.

News July 9, 2025

‘కాంతార ప్రీక్వెల్’ కోసం రిషబ్‌కు రూ.100 కోట్లు?

image

హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని ‘హొంబలే ఫిల్మ్స్’ ₹15 కోట్లతో రూపొందిస్తే ₹400 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ చిత్రానికి రిషబ్ ₹4కోట్లు మాత్రమే ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘కాంతార ప్రీక్వెల్’పై భారీ అంచనాలు ఉండటంతో రిషబ్ తన పారితోషికాన్ని భారీగా పెంచి ₹100 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.

News July 9, 2025

SRSPలో తగ్గిన వరద నీటి ప్రవాహం

image

మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు కురవక పోవటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP)కి చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్ ఫ్లో రావడం లేదు. గడిచిన 24 గంటల్లో కేవలం 4291 క్యూసెక్కులు మాత్రమే వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80TMCలు) కాగా, ప్రస్తుతం 1067 అడుగులు (19.537 TMCలు) మాత్రమే నీటి నిల్వ ఉంది. బాబ్లీ గేట్లు ఎత్తినా ఇప్పటి వరకు కేవలం 8.857 TMCల నీరు మాత్రమే వచ్చి చేరింది.