News June 2, 2024
చిరుత దాడిలో దూడ మృతి
ఓ బర్రె దూడను చిరుత తినేసిన ఘటన కోనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామంలో జరిగింది. బాధిత రైతు లక్ష్మినర్సు తెలిపిన వివరాలు.. సత్యనారాయణ పల్లె వద్ద తన పొలంలో ఏర్పాటు చేసుకున్న షెడ్లో రైతు రోజు మాదిరిగానే దూడను కట్టేశాడు. శనివారం రాత్రి సమయంలో షెడ్లోకి ప్రవేశించిన ఓ చిరుత బర్రె దూడపై దాడి చేసి కళేబరాన్ని అక్కడే వదిలేసి వెళ్లింది. ఆదివారం షెడ్కు వెళ్లిన రైతు దూడపై చిరుత దాడి చేసినట్లు గుర్తించారు.
Similar News
News September 30, 2024
ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు నిలవాలి: సీతక్క
తెలంగాణలోని ప్రతి పల్లె ఆదర్శ గ్రామంగా నిలిచేలా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. కరీంనగర్లో ఆమె మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్ బిల్లుల అంశం సీఎం దృష్టిలో ఉందని త్వరలో సమస్య పరిష్కరిస్తామన్నారు. ప్రతి గ్రామపంచాయతీ కార్యదర్శి క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ ద్వారా గ్రామస్తులకు ఉపయోగపడే పనులు మాత్రమే చేయాలన్నారు.
News September 30, 2024
ధర్మపురిలో నిత్యం 2 వేల లడ్డూ విక్రయాలు
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి లడ్డూ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ ఆలయంలో ప్రతిరోజు 2000 లడ్డూ విక్రయాలు జరుగుతాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా 80 గ్రాముల లడ్డూ ప్రసాదానికి రూ.20 అలాగే 200 గ్రాముల పులిహోర ప్రసాదానికి రూ.15 తీసుకుంటున్నారు. 2023-24 సంవత్సరానికి లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,50,20,00, పులిహోర ప్రసాదం ద్వారా రూ.54,69,750 ఆదాయం సమకూరింది.
News September 30, 2024
ముస్తాబాద్: బస్సు కింద పడి చిన్నారి మృతి
ముస్తాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. సాల్కం మనోజ్ఞ(4) మండల కేంద్రంలోని మహర్షి పబ్లిక్ స్కూల్లో చదువుతోంది. స్కూల్ బస్సు దిగుతుండగా ప్రమాదవశాత్తు టైర్ల కింద పడింది. దీంతో చిన్నారి తలకు తీవ్రగాయలై అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.