News June 27, 2024

చిరుత సంచారంపై కనిపించని అప్రమత్తత

image

మహానంది మండల పరిధిలో సంచరిస్తున్న చిరుత పులి సంచారంపై నంద్యాల కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి గ్రామంలో దండోరా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే గ్రామాలలో ఎక్కడా చిరుత పులి సంచారంపై దండోరా కానీ ప్రజలను అప్రమత్తం చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

Similar News

News July 1, 2024

ఆదోని: రైల్వే పోలీసులు చేతివాటం

image

అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఓ పోలీసు అధికారి అక్రమార్జనకు తెరలేపిన ఘటన ఆదోని రైల్వే డివిజన్ పరిధిలోని ఓ స్టేషన్‌లో ఆదివారం వెలుగుచూసింది. రూ.కోటి విలువైన బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యాపారిని అదుపులో తీసుకున్న పోలీసు అధికారి.. పైఅధికారుల సహకారంతో పైరవీలు చేసి రూ.6లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని వదిలేసిన్నట్లు సోమవారం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

News July 1, 2024

బనగానపల్లె: పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి

image

బనగానపల్లె పట్టణంలోని తెలుగుపేటలోని ఇంటింటికీ సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెన్షన్ రూ.4000 అలాగే 3 నెలల పెంపు రూ.3000 కలిపి ఒకేసారి రూ.7000 పింఛన్ లబ్ధిదారులకు బి.సి.జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు.

News July 1, 2024

ఆదోని: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుడ్లూరులో శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్న బసవరాజు(22)అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నిద్ర లేచి పక్క గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న భర్తను చూసిన భార్య కవిత వెంటనే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు తెలిపింది. 2 నెలల క్రితమే హత్రి బెలగల్ గ్రామానికి చెందిన కవితకు బసవరాజుకు వివాహమైంది. వివాహమైన రెండు నెలలకే ఇలా జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి