News January 21, 2026
చీపురుపల్లి, రాజాంలో రెండు MSME పార్కులు

చీపురుపల్లి, రాజాం నియోజకవర్గాల్లో కొత్తగా రెండు MSME పార్కుల ఏర్పాటుకు వెంటనే స్థలాలు గుర్తించి భూసేకరణ ప్రారంభించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమీక్షలో వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. భోగాపురం విమానాశ్రయం, జాతీయ రహదారి, రైల్వే విస్తరణ, ఫుడ్ పార్కులు, పరిశ్రమల విస్తరణపై సమీక్షించారు.
Similar News
News February 21, 2026
VZM: జనగణన-2027పై 27 నుంచి శిక్షణ

జనగణన మొదటి దశకు సంబంధించి జిల్లా, మండల స్థాయి అధికారులు, సాంకేతిక సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 27 నుంచి మార్చి 1 వరకు MVGR కాలేజీలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు బ్లాక్ మ్యాపింగ్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News February 21, 2026
VZM: డ్రైవింగ్ శిక్షణలో లోపాలు బట్టబయలు

విజయనగరం జిల్లాలోని డ్రైవింగ్ స్కూళ్లపై రవాణాశాఖ శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. నిబంధనలు పాటించకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం, అర్హతలేని శిక్షకులతో శిక్షణ ఇవ్వడం వంటి లోపాలు గుర్తించారు. దీంతో 3 డ్రైవింగ్ స్కూళ్ల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. రోడ్డు భద్రత కోసం నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 21, 2026
మహిళలు, పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత: VZM SP

మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ దామోదర్ అధికారులకు ఆదేశించారు. మహిళల ఫిర్యాదులపై తక్షణ స్పందనతో పాటు వారి రక్షణకు అవసరమైన భద్రత చర్యలు వెంటనే చేపట్టాలని సిబ్బందికి శుక్రవారం సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు.


