News February 21, 2025

చీమకుర్తిలో క్షుద్ర పూజల కలకలం

image

చీమకుర్తి మండలంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఏలూరివారి పాలెం – కూనంనేనివారి పాలెం గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయాన్నే పనులకు వెళ్తున్న వారికి నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, పెద్ద ముగ్గు, మట్టి కుండలు దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 22, 2025

యర్రగొండపాలెం MLA సంచలన ట్వీట్

image

కూటమి ప్రభుత్వంపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రకాశం జిల్లా పొట్ట కొట్టి, అమరావతి నడుముకు నగషీలు చెక్కడం ధర్మమా?. కృష్ణా నది వరదలకు అమరావతి మునిగిపోకుండా ఉండేందుకు రూ.458.12 కోట్లతో వరద నియంత్రణ చేయనున్నారు. ఆ డబ్బులు వెలిగొండ పునరావాసం కోసం వాడితే రూ.25 లక్షల మందికి తాగునీరు, 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు వస్తుంది’ అంటూ Xలో ట్వీట్ చేశారు.

News February 22, 2025

ఒంగోలు: పెళ్లిలో భోజనాల వద్ద గొడవ

image

పెళ్లిలో భోజనాల గొడవ గాలివానలా పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. ఒంగోలులోని ఓ కళ్యాణ మండపంలో గురువారం రాత్రి పెళ్లి జరిగింది. అందులో జిలానీ భోజనాలు వడ్డిస్తుండగా, తమకు సరిగా మర్యాద చేయలేదని అన్వర్, నజీర్, సూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంతటితో వివాదం ముగిసిందనగా, విందు ముగిసిన తరువాత జిలానీపై ముగ్గురు దాడి చేశారు. జిలానీ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 22, 2025

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్

image

☛ కించపరిచే పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ ☛ శ్రీశైలం యాత్రకు 24 గంటలు అనుమతి ☛ ఇంటర్ విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్: కలెక్టర్ ☛ ఆర్గానిక్ సేద్యాన్ని ప్రోత్సహించాలి: జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ☛ భర్త పురుగు మందు తాగాడని పోలీసులకు ఫోన్☛ గ్రూప్ – 2 పరీక్షలకు ఏడు కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్ ☛ చీమకుర్తిలో క్షుద్ర పూజల కలకలం ☛ గ్రూప్-2 మెయిన్స్ వ్రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

error: Content is protected !!