News June 29, 2024
చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్ సస్పెండ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719607760437-normal-WIFI.webp)
చీమకుర్తిలో జనరల్ ఎలక్షన్లో భాగంగా చీమకుర్తికి వచ్చిన CI దుర్గాప్రసాద్ సస్పెండ్ అయ్యారు. ఇటీవల చీమకుర్తి MRO ఆఫీస్ వద్ద ఓ దొంగతనం కేసులో ముద్దాయి బెయిల్పై బయటకు వెళ్లి మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డాడు. అతని దగ్గర లంచం తీసుకొని స్టేషన్ బెయిల్ ఇప్పించినట్లు అభియోగాలు రాగా.. విచారణ జరిపి ఉన్నతాధికారులు నేరం రుజువు కావడంతో సస్పెండ్ చేశారు.
Similar News
News July 1, 2024
ప్రకాశం: వెబ్సైట్లో టెన్త్ మార్కుల జాబితా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719758785300-normal-WIFI.webp)
పదోతరగతి మార్కుల జాబితా www.bse.ap.gov.in వెబ్సైట్లో పొందుపరిచినట్లు డీఈవో సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల లాగిన్ ద్వారా విద్యార్థుల హాల్ టికెట్ ఉపయోగించి మార్కుల జాబితాను పొందవచ్చని పేర్కొన్నారు. మార్కుల జాబితాలో ఏదైనా తప్పులు ఉంటే విద్యార్థులు సరైన రికార్డులతో నేరుగా ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులకు తెలియజేయాలన్నారు.
News July 1, 2024
కురిచేడు: ఆలస్యంగా వెలుగులోకి మృతదేహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719796645443-normal-WIFI.webp)
కురిచేడు మండలంలోని దేకనకొండ గ్రామ పొలాల్లో ఓ వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతుడు తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా గోపాలపేటకు చెందిన అయినవోని లక్ష్మయ్య (55)గా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దర్శికి బతుకుదెరువు కోసం అతను వచ్చినట్లు తెలిసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
News July 1, 2024
ముండ్లమూరు: చేపలు పట్టేందుకు వెళ్లి..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719785691505-normal-WIFI.webp)
బావిలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన ముండ్లమూరు మండలంలోని వేములలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వినుకొండ నాగరాజు (48) చెరువు వద్ద బావిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఆసమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి బావిలో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. నీరు పూర్తిగా బయటకు వెళ్తేనే మృతదేహం లభ్యమవుతుందని తెలిపారు.