News May 26, 2024
చీరాల: రైలు ప్రమాదం.. రెండు చేతులు కోల్పోయిన యువకుడు
చీరాల పట్టణ పరిధిలో పేరాలకు చెందిన వడ్డె నాగేశ్వరరావు బజారుకు చెందిన ఈశ్వరరావు తన రెండు చేతులు పోగొట్టుకున్నాడు. ర్వైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం వేకువజాము సమయంలో కారంచేడు రైలు గేటు దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు రైలు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను రెండు చేతులు కోల్పోయాడు. స్థానికులు 108లో చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 10, 2024
భైరవకోనలో సినీ నటుడు శ్రీకాంత్
చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోనను సినీ నటుడు శ్రీకాంత్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా త్రిముఖ దుర్గాంబిక అమ్మవారిని, శివయ్యను, భైరవేశ్వరుడిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం శ్రీకాంత్ను సత్కరించారు.
News October 10, 2024
ప్రకాశం: ఈ కష్టం ఎవరికీ రాకూడదు..!
అతనో పేద రైతు. ఎంతో కష్టపడ్డాడు. అయినా సరే అప్పులే మిగిలాయి. మరోవైపు ఎదిగి వచ్చిన కుమార్తె పెళ్లి. తప్పనిస్థితిలో మరో రూ.3 లక్షలు అప్పు తెచ్చి ఇంట్లో పెట్టాడు. అర్ధరాత్రి ఆ నగదును దొంగలు దోచేశారు. ఉదయాన్నే నిద్రలేచిన రైతుకు డబ్బు కనపడకపోవడంతో బోరున విలపించారు. ఈ <<14311035>>బాధాకరమైన<<>> ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపాలునిపల్లె గ్రామంలోని వీరంరెడ్డి వాసుదేవరెడ్డి ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి జరిగింది.
News October 10, 2024
ALERT: పొగాకు ఎక్కువ పండించకండి
టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో బుధవారంతో కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తం 16.1 మిలియన్ల పొగాకు కొనుగోళ్లు చేసినట్లు వేలం కేంద్రం అధికారి అట్లూరి శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది కిలో పొగాకు సరాసరి రూ.221లు రైతులకు లభించింది. ఈ ఏడాదికి రూ.279 అందినట్లు చెప్పారు. ప్రస్తుత ధర పోల్చుకుని పొగాకు అత్యధికంగా పండిస్తే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు.