News November 1, 2025

చూపులేని అభ్యర్థుల కోసం స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్

image

దృష్టిలోపం ఉన్న అభ్యర్థుల కోసం పరీక్షల్లో ‘స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్’ ఉపయోగించాలని UPSC నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సాఫ్ట్‌వేర్ ఏర్పాటు అంశాలను పరిశీలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు విజ్ఞప్తి చేసింది. చూపులేని వారికి UPSC సమాన అవకాశాలు కల్పించడం లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టులో పిల్ దాఖలవడంతో కమిషన్ చర్యలు చేపట్టింది.

Similar News

News February 21, 2026

AUSWపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

image

అడిలైడ్ వేదికగా జరిగిన <<19201544>>మూడో టీ20లో<<>> ఆస్ట్రేలియా మహిళల జట్టుపై 17 రన్స్ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసీస్ గడ్డపై భారత్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. ఈ మ్యాచ్‌లో 177 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఆసీస్‌ను 159/9 స్కోరుకే పరిమితం చేసింది. ఆష్లీ గార్డనర్ 57, లిచ్‌ఫీల్డ్ 26 మినహా అందరూ విఫలమయ్యారు. శ్రీచరణి, శ్రేయాంక చెరో 3, అరుంధతి 2, రేణుక ఒక వికెట్ తీశారు.

News February 21, 2026

ట్రంప్‌కు బొమ్మ చూపించాడు!

image

విదేశాలపై టారిఫ్స్ వేసే అధికారం USA అధ్యక్షుడికి లేదని ఆ దేశ సుప్రీంకోర్టు చెప్పడం తెలిసిందేగా. USAలోని చిన్న బొమ్మల కంపెనీ ఓనర్ రిక్ ఈ తీర్పు కోసం పోరాడారు. తన లెర్నింగ్ రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీ చైనా నుంచి టాయ్స్ కొని USAలో వ్యాపారం చేస్తుంది. ట్రంప్ టారిఫ్స్‌తో నష్టపోయిన రిక్, తనలాంటి వ్యాపారులతో కలిసి కోర్టుకెళ్లి కేసు గెలిచారు. తమ నుంచి వసూలు చేసిన అదనపు సుంకం ఇవ్వాలనేది రిక్ తాజా డిమాండ్.

News February 21, 2026

తిరుమలలో శ్రీవారికి నిర్వహించే పూజలివే..

image

ఏడు కొండలపై కొలువైన శ్రీవారికి ప్రతిరోజు ఎన్నో పూజలు చేస్తారు. సుప్రభాతంతో మేల్కొలుపు, తోమాలతో పూల అలంకరణ, అర్చనతో నామస్మరణ నిర్వహిస్తారు. మలయప్పస్వామికి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి వైభవ సేవలు జరుగుతాయి. వారంలో ఒకరోజు అభిషేకం, తిరుప్పావడ, నిజపాద దర్శనం వంటి విశేష సేవలు ఉంటాయి. చివరగా రాత్రి ఏకాంత సేవతో పవళింపు జరిపి ఆలయ ద్వారాలు మూసివేస్తారు.