News February 15, 2025
చెట్లను నరికివేస్తే.. సమాచారం ఇవ్వండి: ఆదిలాబాద్ DFO

అడవిలో లేదా రోడ్డు పక్కన, రెవెన్యూ, పట్టా, గైరాన్ భూముల్లో ఎవరైనా చెట్లను నరికివేస్తే, ఆ సమాచారం ఇచ్చిన వారికి తగిన పురస్కారాలు అందజేస్తామని డీఎఫ్ఓ ప్రశాంత్ పాటిల్ ప్రకటించారు. మానవ జీవనానికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉండే చెట్లను కొందరు ఆర్థిక లబ్ది కోసం నరికేయడం విచారకరమన్నారు. చెట్ల నరికివేత, అడవుల్లో అగ్నిప్రమాదాలు, క్వారీల తవ్వకం లాంటి సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
Similar News
News December 14, 2025
విజయోత్సవ ర్యాలీలు వద్దు: అదనపు ఎస్పీ

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని అదనపు ఎస్పీ కాజల్ సింగ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్, 223 బీఎన్ఎస్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల అనుమతితో, నిర్దేశించిన రోజున మాత్రమే ర్యాలీలు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం బేల, జైనథ్, భీంపూర్, తాంకో, ఆదిలాబాద్(రూ), మావల మండలాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.
News December 14, 2025
ఆదిలాబాద్ జిల్లాలో తొలి ఫలితం

సాత్నాల మండలంలోని సాంగ్వి (జి) గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఆత్రం నగేశ్ గెలుపొందారు. ప్రత్యర్థిపై 389 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచ్ నగేశ్ను పలువురు అభినందించారు.
News December 14, 2025
83.80 శాతం పోలింగ్ నమోదు

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 8 మండలాల్లో 139 పంచాయతీల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. పోలింగ్ సమయం ఒంటి గంట ముగిసే సరికి 83.80 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికార వర్గాలు వెల్లడించారు. ఆయా మండలాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచారు.


