News August 26, 2025
చైన్ స్నాచర్ ఆటకట్టించిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశాల్లో రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్లతో పాటు ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేయూసీ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.23 లక్షల 50 వేల విలువైన 237 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News August 26, 2025
జగిత్యాల రూరల్: సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ తనిఖీ

వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం జగిత్యాల రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డ్స్ను, పరిసరాలను పరిశీలించారు. సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన సర్కిల్ ఇన్ఫర్మేషన్ బుక్, క్రైం రికార్డు, ప్రాపర్టీ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్లను పరిశీలించారు. సర్కిల్ పరిధిలో నమోదవుతున్న గ్రేవ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసుల్లో ఉన్న సీడీ ఫైల్స్పై అడిగి తెలుసుకున్నారు.
News August 26, 2025
రూ.6.74 కోట్ల విలువైన సిటీ స్కాన్ సౌకర్యాన్ని ప్రారంభించిన మంత్రి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రూ.6.74 కోట్ల విలువైన సిటీ స్కాన్ సౌకర్యాన్ని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితతో పాటు సంబంధిత అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో సిటీ స్కాన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు.
News August 26, 2025
తాడేపల్లి: ‘ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు’

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసే పథకంలో భాగంగా MEPMA మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఐఏఎస్ మూడు ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ నిషేధించి వాటి స్థానంలో పర్యావరణంలో కలిసిపోయే బాటిల్స్, కంపోస్టబుల్ ఎరువులు తయారికి అవసరమయ్యే కర్మాగారాలను నెలకొల్పడంలో ఈ సంస్థలు సహకారం అందిస్తుందన్నారు.