News February 13, 2025
చేగుంట: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలకు సువర్ణ

చేగుంట ఐసీడీఎస్ సూపర్వైజర్ సైని సువర్ణ ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు సీడీపీఓ స్వరూప, డీడబ్ల్యుఓ హైమావతి తెలిపారు. గతనెల 23, 24 తేదీలలో హైదరాబాద్ ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నమెంట్లో ప్రతిభ చూపి ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 14 నుంచి 18 వరకు చెన్నైలో జరిగే పోటీల్లో పాల్గొంటున్నట్లు వివరించారు.
Similar News
News October 30, 2025
మెదక్: రేపు బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈ నెల 31న మెదక్లోని PNR స్టేడియంలో ‘ఓపెన్ టు ఆల్’, 40+ వయసు విభాగంలో బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఆసక్తి గల వారు గురువారం సాయంత్రం 5 గంటలలోపు ఆర్ఎస్సై నరేష్ (87126 57954) వద్ద పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
News October 30, 2025
మెదక్: మహిళపై దాడి, దోపిడీ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష

మెదక్ జిల్లాలో మహిళపై దాడి, దోపిడీ కేసులో నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. మహిళపై దాడి చేసి, ఆమె వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలు లాక్కొని, అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో నిందితుడు పకీరా నాయక్కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించిందని పేర్కొన్నారు. నిందితుడికి గతంలోనే వేరే కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది.
News October 30, 2025
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: డీఐఈవో

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యా బోధన చేయాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి(డీఐఈవో) మాధవి ఆదేశించారు. బుధవారం ఆమె జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను పరిశీలించిన మాధవి, విద్యార్థులతో మాట్లాడి సబ్జెక్టుల వివరాలు అడిగారు. ప్రతి విద్యార్థిపై అధ్యాపకులు శ్రద్ధ చూపాలని దిశానిర్దేశం చేశారు.


