News October 2, 2024
చేజర్ల ఎమ్మార్వో నుంచి రూ.3.5 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

చేజర్ల తహశీల్దార్ను బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.3.5 లక్షలు దొచేశారు. సైబర్ నేరగాళ్లు చేజర్ల తహశీల్దార్ వెంకటరమణకు కాల్ చేసి అదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు బెదిరించారు. అనంతరం వారు ఐదు లక్షలు డిమాండ్ చేయగా తహశీల్దార్ మూడున్నర లక్షలు నగదు ఇచ్చారు. అనుమానం వచ్చి సంగం సీఐ వేమారెడ్డికి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 7, 2026
సోమిరెడ్డి అవినీతి రూ.100కోట్లు: కాకాణి

సోమిరెడ్డి నీతిమాలిన మాటలు విని భవిష్యత్తులో ఉద్యోగులు ఇబ్బంది పడొద్దని మాజీ మంత్రి కాకాణి సూచించారు. ‘సోమిరెడ్డి చెప్పారనే వెంకటాచలం సర్పంచ్ను డీపీవో శ్రీధర్ రెడ్డి తొలగించారు. పోలీసులు లేకుండా MLA గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు కుక్కను కొట్టినట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క ఇరిగేషన్ శాఖలోనే సోమిరెడ్డి రూ.100కోట్ల అవినీతి చేశారు’ అని కాకాణి ఆరోపించారు.
News January 7, 2026
నెల్లూరు: 15 మండలాలకు స్వచ్ఛ రథాలు.!

ప్రభుత్వం స్వచ్ఛ గ్రామాల సంకల్పంతో స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తేనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోని 15 మండలాల్లో గతంలో ఇంటింటికీ వచ్చి బియ్యం ఇచ్చే వాహనాల మాదిరిగా రథాలను సిద్ధం చేస్తున్నారు. ఈ రథాల్లో చెత్త సేకరణ గది, సరుకులతో కూడిన ప్రత్యేక ర్యాక్ ఉంటుంది. పొడి వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, ఇనుప వస్తువులు అందిస్తే సరుకులు పొందవచ్చు. సరుకులు వద్దనుకుంటే నగదు చెల్లిస్తారు.
News January 7, 2026
నెల్లూరు: 15 మండలాలకు స్వచ్ఛ రథాలు.!

ప్రభుత్వం స్వచ్ఛ గ్రామాల సంకల్పంతో స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తేనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోని 15 మండలాల్లో గతంలో ఇంటింటికీ వచ్చి బియ్యం ఇచ్చే వాహనాల మాదిరిగా రథాలను సిద్ధం చేస్తున్నారు. ఈ రథాల్లో చెత్త సేకరణ గది, సరుకులతో కూడిన ప్రత్యేక ర్యాక్ ఉంటుంది. పొడి వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, ఇనుప వస్తువులు అందిస్తే సరుకులు పొందవచ్చు. సరుకులు వద్దనుకుంటే నగదు చెల్లిస్తారు.


