News April 9, 2025

చేతబడి చేస్తున్నాడని అనుమానంతో హత్య..!

image

చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని హత్య చేసిన సంఘటన దుమ్ముగూడెం మండలంలో చోటుచేసుకుంది. మండలంలో జెడ్ వీరభద్రం గ్రామానికి చెందిన కొమరం రాముడు మృతదేహం మంగళవారం ఆ గ్రామ చెరువులో లభ్యమయింది. చేతబడి చేస్తున్నాడని గుర్తు తెలియని వ్యక్తులు రాముడిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Similar News

News April 17, 2025

కోడలిపై అత్త గృహ హింస కేసు పెట్టొచ్చు.. కోర్టు కీలక తీర్పు

image

అత్తపై కోడలు గృహ హింస కేసు పెట్టొచ్చు. మరి కోడలి చేతిలో వేధింపులకు గురవుతున్న అత్త అలాంటి కేసు పెట్టొచ్చా? ఓ UP మహిళ పెట్టిన కేసులో ఇదే ప్రశ్న అలహాబాద్ హైకోర్టులో ఉత్పన్నమవగా జడ్జి కీలక తీర్పునిచ్చారు. ‘కోడలు లేదా కుటుంబసభ్యులెవరైనా అత్తని శారీరకంగా, మానసికంగా హింసిస్తే ఆమె బాధితురాలిగా మారుతుంది. డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ 2005 సెక్షన్ 12 ప్రకారం అత్త కోడలిపై కేసు పెట్టొచ్చు’ అని స్పష్టం చేశారు.

News April 17, 2025

MBNR: అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన పెంచుదాం: ఫైర్ స్టేషన్ ఆఫీసర్

image

వేసవికాలంలో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరమని మహబూబ్‌నగర్ అగ్నిమాపక శాఖ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మల్లికార్జున్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గృహాలు, హాస్పిటల్స్, పాఠశాలలు, కర్మాగారాల్లో ప్రమాదాలు, వరదలు, రోడ్డు, రైలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే అగ్నిమాపక శాఖ నంబర్ 101కు సమాచారం అందించాలన్నారు.

News April 17, 2025

రోగికి ఆధార్ తప్పనిసరి : ఆదిలాబాద్ DMHO

image

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు తప్పకుండా ఆధార్ కార్డును తీసుకొని వెళ్లాలని ఆదిలాబాద్ DMHO డా.నరేందర్ రాథోడ్ సూచించారు. తద్వారా వ్యాధిగ్రస్థుల సమాచారం అంతర్జాలంలో నిక్షిప్తం చేస్తామన్నారు. భవిష్యత్తులో రోగికి అందించిన సేవల వివరాలు తెలుసుకోవడానికి సహాయకారిగా ఉంటుందన్నారు. దీని ద్వారా చికిత్సలు అందించడానికి సులువవుతుందన్నారు. ఆరోగ్య, ప్రాథమిక కేంద్రాలకు ఆధార్ తీసుకు వెళ్లాలన్నారు.

error: Content is protected !!