News February 23, 2025
చేన్నేకొత్తపల్లి: పాము కాటుకు గురై చిన్నారి మృతి

చేన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురానికి చెందిన ప్రీతి అనే మూడో తరగతి విద్యార్థిని శనివారం రాత్రి పాముకాటుకు గురై మృతి చెందారు. శనివారం రాత్రి ప్రీతి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా.. నాగుపాము కాటు వేయడంతో ఆమెను తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విద్యార్థిని తల్లితండ్రులు తెలిపారు.
Similar News
News February 23, 2025
రేపు 3 జిల్లాల్లో సీఎం ప్రచారం

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉ.11 గంటలకు నిజామాబాద్, మ.1.30 గం.కు మంచిర్యాల, సా.3.30 గంటలకు కరీంనగర్లో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఇందులో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్, సీతక్క, జూపల్లి, కొండా సురేఖ పాల్గొననున్నారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది.
News February 23, 2025
పార్వతీపురంలో చికెన్, ఎగ్ మేళా

జిల్లాలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత చికెన్, ఎగ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా పశు సంవర్ధక అధికారి మన్మధరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పార్వతీపురంలో భాస్కర డిగ్రీ కళాశాల సమీపం(పెట్రోల్ బంకు)లోను, కొత్తవలస అమ్మవారి గుడి సమీపంలో ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 200 కేజీల చికెన్, 2000 గుడ్లు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు.
News February 23, 2025
గ్రూప్-2 అభ్యర్థులు అల్లాడుతుంటే మ్యాచ్ చూస్తావా?: వైసీపీ

AP: INDvsPAK క్రికెట్ మ్యాచ్ చూడటానికి దుబాయ్ వెళ్లిన మంత్రి <<15555923>>లోకేశ్పై<<>> YCP మండిపడింది. ‘ఇటు రాష్ట్రంలో గ్రూప్-2 అభ్యర్థులు అల్లాడుతుంటే అటు పప్పు నాయుడు మాత్రం దుబాయ్లో మ్యాచ్ చూస్తూ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. అధికారం అంటే మీకు విలాసం.. ప్రజల బాధలు అంటే మీకు సంబరం.. జనం కష్టాలు మీకు సంతోషం. బాధ్యత లేని బర్రెగొడ్లకు అధికారం ఇస్తే పాలన ఇలాగే తగలడుతుంది’ అని X వేదికగా విమర్శించింది.