News October 11, 2025

చేపల వినియోగం పెంపునకు ప్రాధాన్యం: మంత్రి టీజీ భరత్

image

చేపల వినియోగం పెంచేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. శనివారం నన్నూరు టోల్‌గేట్ వద్ద పాణ్యం ఎమ్మెల్యే చరిత, కలెక్టర్ డా.ఏ.సిరితో కలిసి చేపల విలువ ఆధారిత యూనిట్‌ను ప్రారంభించారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యమని ఆయన చెప్పారు. రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో 60శాతం సబ్సిడీ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.

Similar News

News October 11, 2025

కర్నూలు జిల్లా పత్తి రైతులకు శుభవార్త

image

కర్నూలు జిల్లా పత్తి రైతులకు జేసీ డా.నవ్య శుభవార్త చెప్పారు. శుక్రవారం మార్కెటింగ్ శాఖ, సీసీఐ అధికారులతో సమావేశం నిర్వహించిన ఆమె ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాల్‌కు రూ.8,060 మద్దతు ధరకు పత్తి కొనుగోలు ప్రారంభించాలంటూ ఆదేశించారు. రైతులు పత్తి విక్రయానికి ఆదోని 9182361164, ఎమ్మిగనూరు 9182361166, మంత్రాలయం 8328682823, కోడుమూరు 9705556596 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News October 11, 2025

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌నా ఏర్పాట్లు ముమ్మరం: మంత్రి

image

ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ ప‌ర్య‌ట‌న‌ ఏర్పాట్లు ముమ్మరంగా నిర్వహిస్తున్నామనిరాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. శుక్రవారం ఆయన రాగ‌మ‌యూరి వ‌ద్ద ఏర్పాట్లను ప్ర‌ధాని ప్రోగ్రాం స్పెషల్ ఆఫీస‌ర్ వీర పాండియ‌న్‌తో క‌లిసి స్టేజీ, గ్యాల‌రీ నిర్మాణ ప‌నులు ప‌రిశీలించారు. హెలిప్యాడ్, రోడ్లు, పార్కింగ్ ప‌నుల పురోగ‌తిని తెలుసుకున్నారు. నిర్దేశించిన గ‌డువులోపు ప‌నులు పూర్త‌య్యేలా చూడాల‌న్నారు.

News October 10, 2025

పోలీస్ పెట్రోలింగ్ గస్తీ ముమ్మరం: ఎస్పీ

image

కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ప్రజల భద్రత రక్షణలో భాగంగా ప్రధాన రహదారుల్లో పోలీసుల పెట్రోలింగ్, గస్తీని ముమ్మరం చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. గురువారం కర్నూలులో ప్రధాని సభ వద్ద బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్‌తో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి నేరాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.