News August 20, 2024
చేపల వేటకు వెళ్లిన ఒకరి దుర్మరణం
చేపల వేటకు వెళ్లిన ఒకరు ప్రమాదవశాత్తు దుర్మరణం చెందిన ఘటన కోటగిరి దామర చెరువులో మంగళవారం జరిగింది. మధ్యాహ్నం వేళ మండల కేంద్రానికి చెందిన తోకల రాములు (40) అనే వ్యక్తి దామర చెరువులో చేపలు పడుతుండగా చేపలు పట్టే వల కాళ్లకు చుట్టుకొని నీటిలో మునిగాడు. నీటిలో ఊపిరాడక మృతి చెందాడని మృతుని భార్య మల్కవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సందీప్ తెలిపారు.
Similar News
News February 5, 2025
NZB: పంచాయతీ ఎన్నికలకు సిద్ధమా..!
పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అధికారులు ఎన్నికల సామగ్రిని మండల కేంద్రాలకు పంపించి భద్రపరిచారు. ఆర్మూర్ డివిజన్లో 180 పంచాయతీలుండగా బోధన్ డివిజన్ 152, నిజామాబాద్ డివిజన్లో 213 గ్రామ పంచాయతీలున్నాయి. ఇప్పటికే పలువురు ఆశావాహులు పార్టీ నేతలను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
News February 5, 2025
NZB: శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండి: శైలి బెల్లాల్
కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్ జిల్లాల యువ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా HYDలో ఈనెల 11 నుంచి 15 వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతీయువకులకు నైపుణ్య శిక్షణ ఉంటుందని NYK కో ఆర్డినేటర్ శైలి బెల్లాల్ తెలిపారు. ఎంపికైన 25 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని, శిక్షణలో పాల్గొనే ఆసక్తి ఉన్న వారు తమ వివరాలను 91004 35410 నంబర్ కు వాట్సాప్ చేయాలని ఆమె సూచించారు.
News February 5, 2025
NZB: రైలులోంచి పడి వ్యక్తి మృతి
రైలులోంచి ప్రమాదవశత్తు జారి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి శివారులో మంగళవారం సాయంత్రం నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న రైల్లోంచి పడి వ్యక్తి మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.