News March 11, 2025

చేయిచేయి క‌లిపి వాన‌నీటిని ఒడిసి ప‌డ‌దాం: కలెక్టర్

image

వాన‌నీటి సంర‌క్ష‌ణ‌తో భూగ‌ర్భ జ‌లాలు పెరుగుతాయ‌ని, ఆహార భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పించ‌డంలో భూగ‌ర్భ జ‌లాల‌ది కీల‌క‌పాత్ర అని జిల్లాలో జ‌ల్ సంచ‌య్ జ‌న్ భాగీద‌రి కార్య‌క్ర‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్ళాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. సోమ‌వారం కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్య‌క్ష‌త‌న న్యూఢిల్లీ నుంచి వ‌ర్చువ‌ల్‌గా జ‌ల్ సంచ‌య్ జ‌న్ భాగీద‌రిపై స‌మీక్షా సమావేశం నిర్వహించారు.

Similar News

News September 19, 2025

రాబోయే 4 రోజులు వర్షాలు

image

APలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో రాబోయే 4 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. నేడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు-భారీ వర్షాలు, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, GNT, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. TGలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.

News September 19, 2025

నేడు YCP ‘చలో మెడికల్‌ కాలేజీ’ కార్యక్రమం

image

AP: మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ ‘చలో మెడికల్‌ కాలేజీ’ చేపడుతున్నట్లు YCP ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

News September 19, 2025

వరి పంట నారుమడులను పరిశీలించిన కలెక్టర్

image

దువ్వూరు మండలంలో సాగు చేసిన వరి పంట నారుమడులను గురువారం కలెక్టర్ శ్రీధర్ పొలాలకు వెళ్లి నేరుగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల సాగు పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటుపై రైతులతో చర్చించారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలన్నారు. డిమాండ్, మార్కెట్ ఉన్న వాటిని సాగు చేయాలని సూచించారు.