News July 27, 2024
చేవెళ్ల చౌరస్తాలో నిరసన తెలిపాం: CM

అసెంబ్లీలో KCRపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆ నాడు రాజశేఖర్ రెడ్డిని నాటి సభ్యులు ఒప్పించి ప్రాణహిత ప్రాజెక్టును చేవెళ్లకు తీసుకొద్దామనుకుంటే దానిని KCR మెదక్ వరకు నియంత్రించారని ఆరోపించారు. 3 వేల TMCల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా చూశారు కానీ చేవెళ్ల, VKB, తాండూరు, పరిగి, కొడంగల్కు నీళ్లు ఇవ్వలేదని, RRజిల్లాను ఎడారిగా మార్చేందుకు కుట్ర చేస్తుంటే చేవెళ్ల చౌరస్తాలో నిరసన తెలిపామన్నారు.
Similar News
News February 15, 2026
హస్తం జోరు.. ఇక GHMC ఎన్నికలేనా?

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సత్తాచాటడంతో జోష్లో ఉంది. ఇదే ఊపులో GHMC ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు కావటంతో పలు విషయాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో పడింది. మే నెల చివరి కల్లా పాలకమండలి కొలువుదీరేలాగా సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. శివారు మున్సిపాలిటీల్లో హస్తానికి మిశ్రమ ఫలితాలొచ్చాయి.
News February 15, 2026
HYD: ఈ శివాలయానికి వెయ్యేళ్ల చరిత్ర..!

శివారులోని శంకర్పల్లి మం. చందిప్పలో 1000 ఏళ్ల క్రితం నాటి మహిమగల బ్రహ్మసూత్ర మరకత శివాలయం ఉంది. సోమేశ్వర లింగాన్ని దర్శిస్తే వ్యాధులు పోతాయని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో వెలసిన కాలభైరవుడు గుడిని వెయ్యి కళ్లతో రక్షిస్తాడని చెబుతారు. HYD నుంచి శంకర్పల్లి 40 కిలోమీటర్లు. మెహదీపట్నం, పటాన్చెరు నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది. శంకర్పల్లి నుంచి ఆటోలు ఉంటాయి.
News February 15, 2026
HYD: కార్పొరేషన్లో ప్రతి సోమవారం ప్రజావాణి

నూతనంగా ఆవిర్భవించిన మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతీ సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నట్లు కమిషనర్లు వినయ్ కృష్ణారెడ్డి, సృజన స్పష్టంచేశారు. సోమవారం ఉ.10:30 గం. నుంచి మ. ఒంటి గంట వరకు తార్నాకలోని MMC ఆఫీస్లో మల్కాజిగిరి, మాదాపూర్లోని న్యాక్ బిల్డింగ్ సీఎంసీ ఆఫీస్లో సైబరాబాద్ ప్రజావాణి ఉంటుంది. అన్ని సర్కిల్, జోనల్ ఆఫీస్లలో అధికారులు పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు.


