News December 25, 2025
చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను జిల్లాలో విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు. ఈ మాంజా మనుషులతో పాటు పక్షులు, పర్యావరణానికి ఎంతో హానికరమని పేర్కొన్నారు. నైలాన్, సింథటిక్ దారాల వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని, వీటి వినియోగంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విక్రయదారులపై నిఘా ఉంచేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
Similar News
News December 28, 2025
బంగారు కుటుంబాలకు అండగా నిలవాలి: కలెక్టర్

జిల్లాలోని ‘బంగారు కుటుంబాలను’ దత్తత తీసుకుని, వారి ఆర్థిక స్థితిగతులు, మౌలిక వసతుల కల్పన ద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈకుటుంబాలను మార్గదర్శులతో అనుసంధానం చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
News December 28, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 28, 2025
నా ప్రాణానికి ముప్పు: MLC దువ్వాడ

AP: తన ప్రాణానికి <<18684111>>ముప్పు<<>> ఉందని MLC దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. తనకు ఏమైనా జరిగితే దానికి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదే కారణమని ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాకుళం SPని కలిసి ఫిర్యాదు చేశారు. 2+2 గన్మెన్లను కేటాయించాలని కోరారు. కొద్ది రోజులుగా తనకు ఫోన్లో, ప్రత్యక్షంగా బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే వారిని అణచివేయాలనే ధోరణి సరికాదని మీడియాతో అన్నారు.


