News April 14, 2025
చొప్పదండి: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

చొప్పదండి పట్టణం బీసీ కాలనీకి చెందిన గాజుల కనకలక్ష్మి (55) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై మామిడాల సురేందర్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు తమ తల్లిని చంపి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెలతాడు ఎత్తుకుపోయారని కూతురు నాగమణి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Similar News
News April 15, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా శంకరపట్నం మండలంలో 39.3°C నమోదు కాగా, చిగురుమామిడి 39.2, గన్నేరువరం 38.9, జమ్మికుంట 38.7, మానకొండూరు, గంగాధర 38.5, తిమ్మాపూర్ 38.4, రామడుగు, కరీంనగర్ 38.3, కరీంనగర్ రూరల్ 38.2, వీణవంక 37.8, సైదాపూర్ 37.6, చొప్పదండి 37.0, హుజూరాబాద్ 36.7, కొత్తపల్లి 36.6, ఇల్లందకుంట 36.5°C గా నమోదైంది.
News April 14, 2025
KNR: అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కలెక్టర్, పోలీస్ కమిషనర్

అంబేడ్కర్ జయంతి సందర్భంగా కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ అలం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చేసిన సేవలను వారు కొనియాడారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. వారి వెంట జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News April 14, 2025
అలర్ట్: కరీంనగర్ జిల్లా మొత్తం 40°C పై ఉష్ణోగ్రతలు నమోదు

KNR జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. గడచిన 24 గంటల్లో జిల్లా మొత్తం 40°C పై ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మానకొండూర్ మండలంలో 43.0°C నమోదు కాగా, గంగాధర 42.9, రామడుగు 42.8, జమ్మికుంట 42.7, చిగురుమామిడి 42.6, కరీంనగర్ 42.5, వీణవంక 41.6, గన్నేరువరం 41.5, తిమ్మాపూర్ 41.4, ఇల్లందకుంట, కరీంనగర్ రూరల్ 41.2, చొప్పదండి 40.9, శంకరపట్నం 40.5, కొత్తపల్లి 40.4, హుజూరాబాద్ 40.3, సైదాపూర్ 40.2°C గా నమోదైంది.