News September 6, 2025
చోడవరం జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు దొరికారు

చోడవరం సబ్ జైలు నుంచి శుక్రవారం పరారైన ఇద్దరు <<17624302>>ఖైదీలను<<>> విశాఖ సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. చోడవరం సబ్ జైలులో ఖైదీలుగా ఉన్న బెజవాడ రాము, నక్క రవికుమార్ జైలు వార్డెన్పై దాడి చేసి తప్పించుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ సిటీలో కాంప్లెక్స్ వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో CI భాస్కరరావు, అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పట్టుకొని చోడవరం పోలీసులకు అప్పగించారు.
Similar News
News September 6, 2025
కామారెడ్డి: GPOలు అంకిత భావంతో పనిచేయాలి: కలెక్టర్

జిల్లాలో ఎంపికైన GPOలు అంకిత భావంతో పని చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ సూచించారు. శనివారం GPOలు మర్యాదపూర్వకంగా కలెక్టర్ను కలిశారు. గ్రామాల్లో రెవెన్యూ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఎంతో నమ్మకంతో నియమించిందని గుర్తు చేశారు.
News September 6, 2025
కిస్ క్యామ్లో దొరికిన HR.. భర్తతో విడాకులు!

కోల్డ్ ప్లే కన్సర్ట్లో ఆస్ట్రోనోమర్ CEO ఆండీ బైరోన్తో కిస్ <<17113447>>క్యామ్లో<<>> దొరికిన HR క్రిస్టిన్ తన భర్త ఆండ్రూ నుంచి విడిపోతున్నారు. AUG 13న ఆమె న్యూ హాంప్షైర్లోని పోర్ట్స్మౌత్ కోర్టులో విడాకులకు అప్లై చేశారు. తాజాగా ఈ విషయం బయటికొచ్చింది. కిస్ క్యామ్ వీడియో వైరల్ కాగా సదరు కంపెనీ బైరోన్, క్రిస్టిన్ను తొలగించింది. ఇక అప్పటి నుంచే ఆండ్రూ-క్రిస్టినా వేర్వేరుగా ఉంటున్నట్లు సమాచారం.
News September 6, 2025
HYD: నంది వాహనం ఎక్కిన ‘శివ’పుత్రుడు

వినాయక నిమజ్జనోత్సవంలో ‘శివ’పుత్రులు దర్శనమిచ్చారు. అవును.. హిమాయత్నగర్లో ఈ దృశ్యం భక్తులను కనువిందు చేసింది. శనివారం ట్యాంక్బండ్కు ఎడ్లబండి మీద ఓ వినాయకుడిని నిమజ్జనానికి తీసుకొచ్చారు. రథసారథిగా శివుడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంది వాహనం ఎక్కి గణపయ్య వస్తున్నాడు అంటూ భక్తులు పరవశించిపోయారు. ఈ వినూత్న ఆలోచన బాగుంది కదూ.