News November 4, 2025

చోడవరం: మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

చోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 5వ తేదీన జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ లో పోస్టర్ ఆవిష్కరించారు. 17 కంపెనీలు సుమారు 1500 పోస్టులను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు.పది, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, పీజీ పాలిటెక్నిక్ తదితర కోర్సులు చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.

Similar News

News November 4, 2025

కరీంనగర్: SU B.com, Bsc పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

image

SU పరిధిలో జరుగనున్న బి.కాం (బి.ఎస్.ఎఫ్.ఐ) ఈ-కామర్స్, బీ.ఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ విభాగంలో 1వ సెమిస్టర్ పరీక్షల <<18189571>>ఫీజు<<>> నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా NOV 07 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో NOV 10 వరకు చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ లో చూడాలని సూచించారు.

News November 4, 2025

హనుమకొండ: భూ కబ్జాకు యత్నం.. ఇద్దరి అరెస్టు

image

HNK జిల్లా కాకతీయ యూనివర్సిటీ శివారులో భూకబ్జా యత్నం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుండ్లసింగారం సర్వే నంబర్ 1/1లో తన భూమిని మహ్మద్ ఇబ్రహీం, లింగంపల్లి నేతాజీలు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని బాధితుడు బిత్తిని వేణుగోపాలరావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. విచారణలో నిందితుల ప్రమేయం తేలడంతో వారిని అదుపులోకి తీసుకుని రిమాండుకు పంపినట్లు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు తెలిపారు.

News November 4, 2025

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుంది: శ్రీనివాస వర్మ

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుందని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. ప్రైవేటీకరణ చేయాలనుకునే ప్రభుత్వం రూ.11,440 కోట్ల ఆర్థిక సహాయం ఎందుకు ప్రకటిస్తుందని ప్రశ్నించారు. నక్కపల్లిలో మిట్టల్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి డిసెంబర్‌లో శంకుస్థాపన జరగనున్నట్టు వెల్లడించారు. తాళ్లపాలెంలో NCL ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొత్త సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్‌ను ప్రారంభించారు.