News March 27, 2024
చౌడేపల్లి: రామచంద్ర యాదవ్పై కేసు నమోదు

బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్, ఐదుగురు అనుచరులపై ఎన్నికల కోడు ఉల్లంఘన కేసు నమోదు చేసినట్టు ఎస్సై ప్రతాప్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో పలమనేరు రోడ్డులో బస్టాండ్ ప్రాంతంలో సమావేశానికి అనుమతి తీసుకుని.. ప్రైవేటు బస్టాండ్లో సమావేశం నిర్వహించి కోడ్ ఉల్లంఘించారని ఆయన చెప్పారు. రోడ్డుపై బాణసంచా కాల్చడం, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం వంటి కారణాలతో కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News January 2, 2026
మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులను పరిశీలించి రికార్డులపై ఆరా తీశారు. ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News January 2, 2026
పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్

రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లాలోని రైతులకు అందజేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల మండలం వసంతాపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈనెల తొమ్మిది వరకు జిల్లావ్యాప్తంగా సచివాలయాల పరిధిలో గ్రామసభలు నిర్వహించి నూతన పుస్తకాలను అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
News January 2, 2026
చిత్తూరు: రూ.350 కోట్ల ఆదాయం.. మారని బతుకులు.!

పేరుకే CM సొంత జిల్లా. కుప్పం మినహా మరెక్కడ అభివృద్ధే లేదట. పరిశ్రమలు, మౌలిక వసతులు, రవాణా అంతంత మాత్రమే. నేటికీ తాము విద్య, వైద్యం కోసం తమిళనాడు, TPTకి వెళుతున్నట్లు స్థానికులు అంటున్నారు. జిల్లాలో 960 క్వారీలు ఉన్నాయి. ఏటా రూ.200-250 కోట్ల ఆదాయం వస్తుందట. మున్సిపాలిటీ పన్నులు ఇతర మార్గాల నుంచి వచ్చే రూ.80 కోట్లు అదనం. ఈఆదాయం ఎక్కడికి పోతుంది, జిల్లా అభివృద్ధి ఎందుకు జరగలేదో ఆ మురుగన్కే తెలియాలి


