News November 21, 2025
చౌడేపల్లె: నీటిలో దూకి తల్లీబిడ్డ ఆత్మహత్య

చిత్తూరు(D) చౌడేపల్లె మండలంలో విషాదం నెలకొంది. వెంగళపల్లికి చెందిన ఆదిలక్ష్మికి 8నెలల కుమార్తె ఉంది. చిన్నారి హార్ట్కు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. హైదరాబాద్తో పాటు చాలాచోట్ల చికిత్స అందించారు. పాప ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆ తల్లి మనస్తాపానికి గురైంది. బిడ్డతో కలిసి ఆదిలక్ష్మి గ్రామ సమీపంలోని చెక్ డ్యాంలో శుక్రవారం దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లీబిడ్డ మృతదేహాలను చూసి గ్రామస్థులు విలపించారు.
Similar News
News November 21, 2025
ADB: డిసెంబర్లో TCA రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించనున్నట్లు TCA రాష్ట్ర సభ్యురాలు, జడ్పీ మాజీ ఛైర్పర్సన్ చిట్యాల సుహాసిని తెలిపారు. ఈ పోటీలు జిల్లా, జోనల్ స్థాయిలో తరువాత రాష్ట్ర స్థాయిలో ఉంటాయని వివరించారు. అండర్ 23తో పాటు 23ఏళ్ల వారికి నలుగురు క్రీడాకారులకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఆమెతో పాటు జోనల్ ఇన్ఛార్జ్ నరోత్తమ్ రెడ్డి ఉన్నారు.
News November 21, 2025
ANU: తప్పు మీద తప్పు.. ఒకే ప్రశ్న మూడుసార్లు!

ANU పీజీ పరీక్షలు నిర్వహణలో తప్పిదాలు ఆగడం లేదు. <<18322201>>నమూనా పేపర్లు వాడిన గందరగోళంపై <<>>విమర్శలు ఇంకా చల్లారక ముందే, శుక్రవారం జరిగిన Mcom పరీక్షలో ఒకే ప్రశ్న మూడు సార్లు రావడం, పరీక్షను గంట పది నిమిషాల ఆలస్యంగా ప్రారంభించడం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. తాత్కాలిక పాలనలో నడుస్తున్న ఈ నిర్లక్ష్యానికి ముగింపు పలికి, నిర్వహణను క్రమబద్ధం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
News November 21, 2025
నర్సాపూర్: ‘కుల బహిష్కరణపై ఫిర్యాదు.. పట్టించుకోని ఎస్ఐ’

నర్సాపూర్ మండలం గూడెంగడ్డలో ఓ వ్యక్తిని కుల బహిష్కరణ చేశారు. బాధితుడు తెలిపిన వివరాలు.. గ్రామంలో అమ్మవారి గుడి నిర్మాణానికి పెద్దలు నిర్ణయించారు. అయితే అందరూ బాగుండాలనే ఉద్దేశంతో గోపురం నీడ ఇళ్లపై పడకుండా కొద్ది దూరంలో నిర్మించాలని బాధితుడు చెప్పినందుకు పంచాయతీ పెట్టి, పరువు తీసి,కులబహిష్కరణ చేశారు. పొలంలో వరి కొయ్యనీవకుండా అడ్డుపడ్డారు. నర్సాపూర్ SI, SPకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.


