News October 7, 2025
జంగారెడ్డిగూడెం: పోలీస్ జాగిలంతో తనిఖీలు

జంగారెడ్డిగూడెంలో పోలీసులు మంగళవారం జాగిలంతో తనిఖీలు నిర్వహించారు. సీఐ సుభాశ్, ఎస్ఐ జబీర్లు బస్టాండ్, జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేశారు. జాగిలాలతో బస్ స్టాండ్లోని ప్రయాణికుల లగేజీలు, పార్శిల్ ప్రాంతాలు, అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు. రవాణా కేంద్రాల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దొంగతనాలు నివారించడమే లక్ష్యంతో ఈ తనిఖీలు చేశామని సీఐ తెలిపారు. –
Similar News
News October 7, 2025
కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పి.యుగంధర్

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పి.యుగంధర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు అనంతపురం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న యుగంధర్ని పదోన్నతిపై కృష్ణాజిల్లా డీఎంహెచ్ఓగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా వెంకట్రావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో యుగంధర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
News October 7, 2025
రామాయణం మన పూజ్య గ్రంథం: కలెక్టర్ నాగరాణి

రామాయణ మహా కావ్యాన్ని రచించి మానవాళికి అందించి సన్మార్గాన్ని నిర్దేశించిన ఆదర్శప్రాయుడు మహర్షి వాల్మీకి అని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్లో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి నిర్వహించారు. వాల్మీకి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. పుణ్యభూమి, కర్మభూమి మన భారతదేశమని, రామాయణం మన పూజ్య గ్రంథమన్నారు.
News October 7, 2025
వాల్మీకి జీవిత విశేషాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి: కలెక్టర్

మహర్షి వాల్మీకి జీవిత విశేషాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకొని విశాఖ జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మానవ జీవితానికి అనువైన విధంగా వాల్మీకి రామాయణాన్ని రచించి ఎన్నో విషయాలపై మహత్తర సందేశాన్ని అందించారని గుర్తు చేశారు.