News October 4, 2025

జంట జలాశయాలకు వరద.. గేట్లు ఎత్తివేత

image

జంట జలాశయాలకు మరోసారి వరద నీరు చేరింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో ఉస్మాన్‌సాగర్ 3 గేట్లు, హిమాయత్‌సాగర్ 2 గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు సూచించారు. వరదలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో జలమండలి అధికారులు పరిస్థితిని సమీక్షించారు.

Similar News

News October 4, 2025

HYDకు తొలి టెస్లా.. కొన్నది ఇతనే!

image

కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి సీనియర్ సర్జన్ డా.ప్రవీణ్ Tesla Model Y కొనుగోలు చేశారు. తనకు భద్రకాళీ అమ్మవారు సెంటిమెంట్ అనుకుంటా! ఈ దసరాకి అక్కడే వాహన పూజ చేయించారు. ‘వాహన పూజ చేయించకుంటే భారతీయ సంస్కృతిలో టెస్లానే కాదు ఏ కారు అయినా 5 స్టార్ రేటింగ్ పొందదు’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, TGలో తొలి టెస్లా కారు ప్రవీణ్ కొనుగోలు చేయడం విశేషం. ఈ కారు ధర (ex-showroom) రూ.59.89 లక్షలుగా ఉంది.

News October 4, 2025

అమెరికాలో LBనగర్ యువకుడి మృతి.. CM దిగ్భ్రాంతి

image

అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో LBనగర్ వాసి పోలే చంద్రశేఖర్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదనను కలిగించిందని CM రేవంత్ అన్నారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం’ అని CM ట్వీట్ చేశారు.

News October 4, 2025

గోదావరి ఫేజ్- 2&3 పనులు త్వరలో ప్రారంభం

image

గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2&3 ప్రాజెక్టు పనులు త్వరగా ప్రారంభించాలని జలమండలి MD అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ప్రాజెక్టులో భాగంగా ఘన్‌పూర్ వద్ద నిర్మించనున్న మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు రూ.7,360 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. మూసీ పునరుజ్జీవనం, జంట జలాశయాలను గోదావరితో నింపడానికి ఈ ఫేజ్ 2, 3కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.