News January 9, 2025
జంప్డ్ డిపాజిట్ స్కామ్తో జాగ్రత్త: SP వకుల్ జిందాల్

నేరగాళ్లు జంప్డ్ డిపాజిట్ స్కామ్కు పాల్పడుతున్నారు. అకౌంట్లో నగదు వేస్తున్నారు. మెసేజ్ చూసి UPIతో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే డబ్బులు దోచేస్తున్నారు. ఈ స్కామ్ పట్ల విజయనగరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP వకుల్ జిందాల్ పేర్కొన్నారు. అకౌంట్లో డబ్బులు పడినట్లు మెసేజ్ వస్తే 30 ని. తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలని, ఫస్ట్ టైమ్ రాంగ్ UPI పిన్ ఎంటర్ చేస్తే స్కామర్ రిక్వస్ట్ క్యాన్సిల్ అవుతుందన్నారు.
Similar News
News December 21, 2025
భోగాపురం రోడ్డు కనెక్టివిటీ పనులపై కలెక్టర్ సమీక్ష

భోగాపురం మండలం సవరవల్లి–తూడెం మార్గం ద్వారా భోగాపురం రోడ్డు కనెక్టివిటీ పనులపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్షించారు. రహదారిపై మామూలు కల్వర్టు స్థానంలో బాక్స్ కల్వర్టు ఏర్పాటు చేయాలని, అందుకు అనుగుణంగా సవరించిన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు పనులను 5, 6 నెలల్లో పూర్తిచేయాలని సూచించారు.
News December 21, 2025
భోగాపురం రోడ్డు కనెక్టివిటీ పనులపై కలెక్టర్ సమీక్ష

భోగాపురం మండలం సవరవల్లి–తూడెం మార్గం ద్వారా భోగాపురం రోడ్డు కనెక్టివిటీ పనులపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్షించారు. రహదారిపై మామూలు కల్వర్టు స్థానంలో బాక్స్ కల్వర్టు ఏర్పాటు చేయాలని, అందుకు అనుగుణంగా సవరించిన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు పనులను 5, 6 నెలల్లో పూర్తిచేయాలని సూచించారు.
News December 20, 2025
VZM: పశువుల యజమానులకు ఎస్పీ హెచ్చరిక

జిల్లాలో రహదారులపై పశువులను స్వేచ్ఛగా వదిలితే యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని SP దామోదర్ హెచ్చరించారు. మున్సిపల్ అధికారులతో కలిసి పట్టణంలో రోడ్డుపై తిరుగుతున్న పశువులను శుక్రవారం తరలించారు. ఈ నేపథ్యంలో SP మాట్లాడుతూ.. పశువుల వలన ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న బిచ్చగాళ్లపై కూడా చర్యలు ఉంటాయన్నారు.


