News April 21, 2025
జంబ్లింగ్ విధానంలో ఏయూ డిగ్రీ పరీక్షల నిర్వహణ

ఏయూ పరిధిలో డిగ్రీ రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు తెలిపారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో 180 కాలేజీల విద్యార్థులకు జంబ్లింగ్ విధానంలో 91 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండో సెమిస్టర్ విద్యార్థులకు ఉ.9 నుంచి 12 వరకు, నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
Similar News
News December 19, 2025
జీవితఖైదు వేసే అధికారం సెషన్స్ కోర్టుకు లేదు: సుప్రీం కోర్టు

జీవితఖైదు శిక్ష విధించే అధికారం కేవలం రాజ్యాంగబద్ధ కోర్టులకు మాత్రమే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించడం, కోర్టులు వేసిన శిక్ష తగ్గించే అధికారాలు సెషన్ కోర్టులకు లేవని జస్టిస్ అహ్సానుద్దిన్ అమానుల్లా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల బెంచ్ చెప్పింది. లైంగిక కోరిక తీర్చడానికి నిరాకరించడంతో మహిళకు నిప్పంటించి చంపేసిన కేసు విచారణలో సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది.
News December 19, 2025
తెలంగాణ ఫుట్బాల్ జట్టుకు సిద్దిపేట బిడ్డ

జాతీయ స్థాయి సంతోష్ ట్రోఫీలో తలపడే తెలంగాణ ఫుట్బాల్ జట్టుకు సిద్దిపేట వాసి సాయి యశ్వంత్ ఎంపికయ్యాడు. యశ్వంత్ సిద్దిపేటలోనే ఫుట్బాల్లో ఓనమాలు నేర్చుకుని, ప్రస్తుతం హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నాడు. యశ్వంత్ ప్రతిభను గుర్తించి రాష్ట్ర జట్టులోకి తీసుకోవడంపై టీఎఫ్ఏ సెక్రటరీ ఫాల్గుణ, కోచ్ అక్బర్ నవాబ్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా క్రీడాకారుడు జాతీయ జట్టుకు ఆడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News December 19, 2025
విశాఖ రుషికొండ బిల్డింగ్పై జగన్ ఏమన్నారంటే?

AP: మెడికల్ కాలేజీల అంశంపై గవర్నర్ను కలిసిన అనంతరం YCP చీఫ్ జగన్ విశాఖ రుషికొండ నిర్మాణాలపై స్పందించారు. ‘మా హయాంలో రుషికొండపై రూ.230CRతో బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మిస్తే, అది ఇప్పుడు నగరానికే తలమానికమైంది. అయినా దానిపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. విశాఖలో ఒకరోజు యోగా డే కోసం అంతకంటే ఎక్కువే ఖర్చు చేశారు. మ్యాట్లు మొదలు మిగిలిన సామగ్రి కొనుగోలులోనూ అవినీతికి పాల్పడ్డారు’ అని ఆరోపించారు.


