News March 31, 2024

జక్రాన్ పల్లిలో ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన జక్రాన్ పల్లిలో జరిగింది. సికింద్రాపూర్ గ్రామానికి చెందిన తలారి బుర్రన్న(42) బాల్ నగర్ నుంచి స్కూటీ పై సికింద్రాపూర్‌కి వస్తుండగా వెనకనుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 7, 2026

NZB: సమస్యలను తీర్చేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోంది: CP

image

దివ్యాంగుల సమస్యలను తీర్చేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని NZB పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. బుధవారం నిర్వహించిన డాక్టర్ లూయి బ్రెయిలీ 217వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడిన దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం అధిగమించే దిశగా ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

News January 7, 2026

NZB: ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌కు అతిథి అధ్యాపకుల వినతి

image

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి బుధవారం సందర్శించారు. డిగ్రీ కళాశాల అతిథి అధ్యాపకులకు ఎంటీఎస్ విధానం, ఉద్యోగ భద్రత కల్పించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఛైర్మన్ ఈ అంశం తమకు అవగాహన ఉందని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

News January 7, 2026

NZB: ఖైదీలను కొట్టారని జైలు అధికారులపై వేటు..!

image

నిజామాబాద్ జిల్లా జైలర్ ఉపేందర్‌ను సస్పెండ్ చేస్తూ, మరో జైలర్ సాయి సురేశ్‌ను ADB జైలుకు బదిలీ చేస్తూ జైళ్ల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా జైలర్లిద్దరూ తమను తీవ్రంగా కొట్టారని వారం రోజుల క్రితం జైలులోని ఇద్దరు ఖైదీలు చాకలి రాజు, కర్నే లింగం జడ్జికి తెలపడంతో ఈ విషయంపై జైలు శాఖ అధికారులు జిల్లా జైలుకు వచ్చి విచారణ చేపట్టి డీజీపీకి నివేదిక ఇవ్వగా వేటు పడిందని తెలిసింది.