News September 12, 2025
జగదేవ్పూర్: భర్తపై ప్రియుడితో కలిసి దాడి.. ఇద్దరి అరెస్ట్

అక్రమ సంబంధం కారణంగా ఓ మహిళ కట్టుకున్న భర్తనే కడతేర్చాలనుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జగదేవ్పూర్ మండలం ఇటిక్యాలకు చెందిన ఓ వ్యక్తితో మమతకు వివాహమైంది. అనంతరం ఆదే గ్రామానికి చెందిన వడ్డే బాబుతో వివాహేతర బంధం ఏర్పడింది. వారికి భర్త అడ్డు వస్తున్నాడనే నెపంతో ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాబు, మమతను గురువారం అరెస్ట్ చేశారు.
Similar News
News September 12, 2025
పాతబస్తీ మెట్రో.. రూ.433 కోట్ల పరిహారం విడుదల

పాతబస్తీ మెట్రో పనులపై MD NVS రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. భవన కూల్చివేత సాగుతుండగా రూ.433 కోట్ల పరిహారం విడుదల చేశారు. ప్రత్యేక నోటీసులో అధికారులు వివరాలు తెలిపారు. ఇప్పటివరకు పాతబస్తీ మెట్రో రూట్లో దాదాపు 550 భవనాల కూల్చివేత పూర్తయినట్లు వెల్లడించారు.
News September 12, 2025
గర్భిణులు ఎలా పడుకోవాలంటే..

ప్రెగ్నెన్సీలో ఎడమ పక్కకి పడుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల కడుపులోని బిడ్డకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. వ్యర్థ పదార్థాలు కూడా మూత్రాశయాన్ని చేరుకోవడం సులభమవుతుంది. కాళ్లు, చేతుల వాపు తగ్గుతుంది. మూడో త్రైమాసికంలో సరైన నిద్ర కోసం దిండ్లను ఉపయోగించవచ్చు. దీంతో పాటు మెటర్నటీ బెల్ట్, నైట్ బ్రా కూడా మంచి నిద్రకు సహకరిస్తాయి. పడుకోవడానికి కనీసం గంట ముందే డిన్నర్ పూర్తి చేయాలి.
News September 12, 2025
వరి, మొక్కజొన్నలో విత్తనశుద్ధి

☛ వరి: పొడి విత్తనశుద్ధిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. అదే దమ్ము చేసిన నారుమడికైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బెండజిమ్ మందు కలిపిన ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి మండె కట్టి నారుమడిలో చల్లాలి. మొక్కజొన్న: కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ మందుతో విత్తనశుద్ధి చేయడం వల్ల మొదటి దశలో వచ్చే తెగుళ్ల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవచ్చు.