News December 24, 2025

జగన్‌కు జ్వరం.. కార్యక్రమాలు రద్దు: వైసీపీ

image

AP: మాజీ సీఎం, తమ పార్టీ అధినేత YS జగన్ అస్వస్థతకు గురైనట్లు వైసీపీ ట్వీట్ చేసింది. ‘జగన్ జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్ల సూచన మేరకు పులివెందుల పర్యటనలో ఇవాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు’ అని తెలిపింది.

Similar News

News February 17, 2026

వెంకీ-కార్తీతో అనిల్ క్రేజీ మల్టీస్టారర్?

image

వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి కలిసి వర్క్ చేయనున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో కీలక పాత్ర కోసం తొలుత ఫహాద్ ఫాజిల్‌ పేరు వినిపించింది. ఇప్పుడు తమిళ స్టార్ కార్తీ పేరు తెరపైకి వచ్చింది. ‘బామ్మర్ది బాలిరెడ్డి’ టైటిల్ ప్రచారంలో ఉంది. జులై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. పూజా హెగ్డే, కీర్తి సురేశ్ హీరోయిన్లని టాక్. 2027 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News February 17, 2026

త్వరలో హాస్టళ్లలోని 1,433 పోస్టుల భర్తీ: సవిత

image

AP: సంక్షేమ హాస్టళ్లలోని 1,433 కుక్, లేబర్, పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నామని మంత్రి సవిత అసెంబ్లీలో వెల్లడించారు. ‘142 కుక్, లేబర్, 1,291 పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తాం. కొత్తగా 10 MJP BC గురుకులాలను నెలకొల్పుతాం. 6 గురుకుల స్కూళ్లను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తాం. పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకోసం ₹420CR, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ₹933 CR కేటాయించాం’ అని వివరించారు.

News February 17, 2026

అజిత్ పవార్ మృతి.. కీలక పరిణామం

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ <<19106331>>మృతి కేసులో<<>> కీలక పరిణామం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంపై సీబీఐ విచారణ చేయాలని ఆయన భార్య, Dy.CM సునేత్రా పవార్ డిమాండ్ చేశారు. NCP లీడర్లు, పెద్ద కుమారుడు పార్థ్‌తో ఆమె సీఎం ఫడణవీస్‌ను కలిసి ఈ మేరకు లేఖను అందజేశారు. ‘ఈ విషయంపై కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తామన్నారు’ అని NCP నేత సునీల్ వెల్లడించారు.