News December 6, 2024
జగన్తో సమావేశానికి ధర్మాన, దువ్వాడ గైర్హాజరు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నేతలతో మాజీ సీఎం జగన్ బుధ, గురువారం కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ ఓడిపోవడంతో పలు అంశాలపై చర్చించారు. ఇంతటి కీలకమైన సమావేశానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరు కాలేదు. ఎన్నికల తర్వాత వైసీపీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉన్నారు. కీలకమైన సమావేశానికి సైతం గౌర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ సైతం ఈ సమావేశానికి రాలేదు.
Similar News
News February 21, 2026
నరసన్నపేట: 48 గంటల్లోనే జాబ్ కార్డు మంజూరు

ఉపాధి హామీ పథకం లో భాగంగా లబ్ధిదారులు జాబ్ కార్డ్ కోరిన 48 గంటలలోనే మంజూరు చేయడం జరుగుతుందని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ లవ రాజు తెలిపారు. నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద జరిగిన ప్రజా వేదికలో భాగంగా శుక్రవారం సాయంత్రం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క వేతనదారుడికి పని కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు.
News February 21, 2026
SKLM: ‘ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం’

ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రవి బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న 13 ఆదర్శ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆయా మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్షలు జరుగుతాయిన్నారు. https://www.cse.ap.gov.in/apms.ap.gov.inలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
News February 21, 2026
SKLM: ‘ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం’

ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రవి బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న 13 ఆదర్శ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆయా మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్షలు జరుగుతాయిన్నారు. https://www.cse.ap.gov.in/apms.ap.gov.inలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.


